
జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ భారతదేశ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పదవీ విరమణ తర్వాత అంటే మే 14, 2025 నుండి ఆయన ఈ పదవిని చేపడతారు. కొలిజియం సిపారసుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది... దీంతో అధికారికంగా సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ గా గవాయ్ పేరు కన్ఫర్మ్ అయ్యింది.
సాంప్రదాయం ప్రకారం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిని సిజెఐ పదవికి సిఫారసు చేస్తారు. ఇలా ఏప్రిల్ 16, 2025న ప్రస్తుత సిజెఐ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని కొలిజియం జస్టిస్ గవాయ్ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ సిఫారసును ఇవాళ(మంగళవారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు... దీంతో అధికారికంగా గవాయ్ నియామకం పూర్తయ్యింది. జస్టిస్ గవాయ్ మే 14, 2025న ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 23, 2025 వరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తారు.
2010లో పదవీ విరమణ చేసిన జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ తర్వాత షెడ్యూల్డ్ కులాల నుండి ప్రధాన న్యాయమూర్తి అయిన రెండవ వ్యక్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ నిలిచారు ఉన్నత న్యాయవ్యవస్థలో ప్రాతినిధ్యం పరంగా ఇది ఒక ముఖ్యమైన అడుగు.
నవంబర్ 24, 1960న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు జస్టిస్ గవాయ్. ఆయన బలమైన ప్రజాసేవా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. ఆయన తండ్రి, దివంగత ఆర్.ఎస్. గవాయ్, ప్రముఖ సామాజిక కార్యకర్త, బీహార్, కేరళ రాష్ట్రాల గవర్నర్గా కూడా పనిచేశారు.
జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాది రాజా ఎస్. భోంస్లే వద్ద న్యాయ వృత్తిని ప్రారంభించారు. 1987లో బాంబే హైకోర్టులో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించి, రాజ్యాంగ, పరిపాలనా చట్టంపై దృష్టి సారించారు.
అనేక సంవత్సరాలుగా, జస్టిస్ గవాయ్ వివిధ పౌర, ప్రభుత్వ సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు:
ఆగస్టు 1992లో, బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్లో అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదిగా, అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. 2000లో ప్రభుత్వ న్యాయవాదిగా, ప్రభుత్వ ప్రాసిక్యూటర్గా ఎదిగారు.