ఇండియాలో 18,454 కరోనా కేసులు: కేరళలోనే అత్యధికం

By narsimha lodeFirst Published Oct 21, 2021, 10:46 AM IST
Highlights

ఇండియాలో గత 24 గంటల్లో 18,454 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 3,41,27,450 కి చేరుకొన్నాయి.నిన్న ఒక్క రోజే కరోనాతో 160 మంది చనిపోయారు. 

న్యూఢిల్లీ: Indiaలో గత 24 గంటల్లో 18,454కొత్త Corona కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,41,27,450కి చేరింది.మరో వైపు కరోనాతో 160 మంది చనిపోయారు. నిన్న ఒక్క రోజు 12,47,506 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా ఐసీఎంఆర్ ప్రకటించింది.

also read:చారిత్రాత్మక విజయం.. వందకోట్ల మార్క్ ను దాటబోతున్న టీకాడ్రైవ్.. సంబరాలకు అంతా సిద్ధం..

 దేశంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,52,811కి చేరింది. మరోవైపు నిన్న 17,561 మంది కరోనా నుండి కోలుకొన్నారు. దీంతో కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 3,34,95,808కి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

కరోనా రోగుల రికవరీ రేటు 98.15శాతానికి చేరిందని వైద్య ఆరోగ్యశాఖాధికారులు ప్రకటించారు. మరో వైపు కరోనా యాక్టివ్ కేసులు 1,78,831 కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.52 శాతంగా నమోదైందని ICMR తెలిపింది.

కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్న మాత్రం కరోాన కేసులు 11,150కి చేరాయి. కేరళ రాష్ట్రంలో 48,70,584కి కేసులు చేరుకొన్నాయి. ఈ నెల 14 నుండి 19వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయి.కానీ నిన్న మాత్రం అధికంగా కేసులు రికార్డయ్యాయి. నిన్న ఒక్క రోజు కేరళ రాష్ట్రంలో 82 మంది కరోనాతో మరణించారు.దీంతో కేరళలో 27,084 మంది చనిపోయారు. కేరళలో కరోనా నుండి 47,69,373 మంది కోలుకొన్నారు.దేశంలో కరోనా వ్యాక్సిన్ 100 కోట్ల మైలురాయిని దాటింది.

ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న  రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి.
 

click me!