పాకిస్థాన్ కు దెబ్బ మీద దెబ్బ... ఎయిర్ డిఫెన్స్ సిస్టంను ధ్వంసంచేసిన భారత్

Published : May 08, 2025, 04:15 PM IST
పాకిస్థాన్ కు దెబ్బ మీద దెబ్బ... ఎయిర్ డిఫెన్స్ సిస్టంను ధ్వంసంచేసిన భారత్

సారాంశం

భారత్ పై దాడికి ప్రయత్నించిన పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెబుతోంది భారత్. ఇప్పటికే బలహీనంగా ఉన్న పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంను పూర్తిగా ధ్వంసం చేసేందుకు సిద్దమయ్యింది. ఇందులో భాగంగానే లాహోర్ లోని వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసారు.     

Operation Sindoor : భారత్  దెబ్బకు పాకిస్థాన్ విలవిల్లాడిపోతోంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది భారత్ ఆర్మీ. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కూడా ఉగ్రవాదుల ఏరివేత చేపట్టింది. ఇలా భారత యుద్దవిమానాలు పాక్ భూభాగంలోకి ప్రవేశించినా ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోలేకపోయింది. దీన్నిబట్టే పాక్ రక్షణ వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

తాజాగా మరోసారి పాకిస్థాన్ పై భారత్ దాడికి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఉగ్రవాదులను కాదు పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ టార్గెట్ చేసినట్లు సమాచారం. లాహోల్ లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై భారత్ దాడి చేసింది. దీంంతో పాక్ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసమయ్యింది.

ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నించింది పాకిస్థాన్. ఇలా దేశంలో ఉద్రిక్తతలను పెంచేందుకు పాకిస్తాన్ చేసిన తాజా ప్రయత్నాలను రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొందని గురువారం ధృవీకరించింది. భారత సాయుధ దళాలు లాహోర్‌లోని కీలకమైన స్థావరం సహా పాకిస్తాన్ వైమానిక రక్షణ రాడార్‌లు, వ్యవస్థలను బహుళ ప్రదేశాలలో ధ్వంసం చేశాయి.

ప్రభుత్వం ప్రకారం... పాకిస్తాన్ గత రాత్రి నుండి గురువారం తెల్లవారుజాము వరకు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్‌లలోని వ్యూహాత్మక సైనిక స్థానాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణి దాడులను ప్రారంభించింది. శ్రీనగర్, పఠాన్‌కోట్, అమృత్‌సర్, లూధియానా, చండీగఢ్ నగరాలు రాడార్‌లో ఉన్నాయి. అయితే భారతదేశపు బలమైన వైమానిక రక్షణ వ్యవస్థ  ఈ దాడిని భగ్నం చేసింది... ఇలా ప్రమాదాన్ని అడ్డుకుంది. 

 

ప్రతిస్పందనగా, భారత దళాలు పాకిస్తాన్ వైమానిక రక్షణ మౌలిక సదుపాయాలపై లక్ష్య దాడులు చేపట్టాయి. “ఈరోజు ఉదయం భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని అనేక ప్రదేశాలలో వైమానిక రక్షణ రాడార్‌లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి.  లాహోర్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసం చేయబడింది” అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

పాకిస్తాన్ కాల్పుల్లో 16 మంది భారత పౌరులు మృతి

ఇదే సమయంలో పాకిస్తాన్ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద కాల్పులను పెంచింది, కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెండర్, రాజౌరి సెక్టార్లలోని సామాన్య పౌరుల నివాస ప్రాంతాలను మోర్టార్లు, భారీ ఫిరంగులతో లక్ష్యంగా చేసుకుంది. పాక్ కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పిల్లలు సహా పదహారు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ దాడులకు ప్రతిదాడిగా భారత దళాలు ఫిరంగులతో ప్రతిస్పందించవలసి వచ్చింది.

బుధవారం తెల్లవారుజామున 1:05 గంటలకు ప్రారంభమైన 25 నిమిషాల వ్యవధిలో ఆపరేషన్ సిందూర్ ముగిసింది. ఇంత తక్కువ సమయంలో పాకిస్తాన్‌లో నాలుగు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఐదు ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేపట్టి ధ్వంసం చేసింది. ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాలు, శిక్షణా కేంద్రాలను కూల్చివేయడానికి HAMMER స్మార్ట్ బాంబులు, SCALP క్షిపణులు వంటి అధునాతన మందుగుండు సామగ్రిని ఈ ఆపరేషన్‌లో ఉపయోగించారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tamil Nadu Assembly Election 2026 : విజయ్ దళపతి దెబ్బ.. డిప్యూటీ సీఎం పదవి ఖాయమేనా?
Tamil Nadu Assembly Election 2026 : తమిళనాడు ఎన్నికల డేట్ ఫిక్స్.. స్టాలిన్ పీఠం దక్కేది ఎవరికి? పూర్తి షెడ్యూల్ ఇదే