ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ను ఏకిపారేసిన భారత్

Published : Apr 29, 2025, 09:06 AM IST
ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ను ఏకిపారేసిన భారత్

సారాంశం

ఐక్యరాజ్యసమితిలో పహల్గాం ఉగ్రదాడిని లేవనెత్తిన భారత్, సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాకిస్తాన్‌ను ఖండించింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలను ఉటంకిస్తూ, దాన్ని 'దుష్ట దేశం'గా అభివర్ణించింది.

పహల్గాం దాడి: సోమవారం ఐక్యరాజ్యసమితి (United Nations)లో పహల్గాం ఉగ్రదాడిని భారత్ లేవనెత్తింది. సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, భారత్ లో అస్థిరతను సృష్టిస్తోందని పాకిస్తాన్‌ను నిందించింది.

ఐక్యరాజ్యసమితి భారత ఉప శాశ్వత ప్రతినిధి రాయబారి యోజన పటేల్ న్యూయార్క్‌లో ఉగ్రవాద బాధితుల సంఘం ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, పాకిస్తాన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

భారత్ "పాక్ ఉగ్రవాదానికి బలైపోతోంద"ని పేర్కొన్నారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చినట్లు ఒప్పుకున్న విషయాన్ని ప్రస్తావించారు.

ప్రపంచ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్

పటేల్ మాట్లాడుతూ, "పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు, శిక్షణ, నిధులు ఇస్తున్నట్లు ఒప్పుకున్న విషయాన్ని ప్రపంచం మొత్తం విన్నది. ఈ ఒప్పుకోలు ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. దీని ద్వారా పాకిస్తాన్ దుష్ట దేశంగా బయటపడింది. ఇది ప్రపంచ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, అస్థిరతను సృష్టిస్తోంది. ప్రపంచం ఇకపై కళ్ళుమూసుకుని ఉండలేదు" అని అన్నారు.

 

 

గత వారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పహల్గాం ఉగ్రదాడిని ఖండించింది. దానికి బాధ్యులైన వారిని జవాబుదారీ చేయాలని పేర్కొంది. ఉగ్రవాద నిర్వాహకులు, నిధులు సమకూర్చేవారిని, ప్రోత్సహించేవారిని శిక్షించాలని 15 దేశాల మండలి కోరింది.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది పర్యాటకులు. పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత తీసుకుంది.

దీని తర్వాత భారత్ 1960 సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. అటారీ సరిహద్దును మూసివేసింది. పాకిస్తాన్ పౌరులకు సాసార్క్ వీసా మినహాయింపును రద్దు చేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu