రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క ఆదేశాలు.. సివిల్ డిఫెన్స్ చట్టంలో 11వరూల్ వినియోగించాలని సూచన

Published : May 09, 2025, 05:56 PM IST
రాష్ట్రాల‌కు కేంద్రం కీల‌క ఆదేశాలు.. సివిల్ డిఫెన్స్ చట్టంలో 11వరూల్ వినియోగించాలని సూచన

సారాంశం

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారతదేశం ప్రతీకార చర్యలు చేపట్టింది. దీంతో, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు అత్యవసర ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

పహల్గాంలో భారతీయ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. దీని తర్వాత పాకిస్తాన్‌పై భారత ప్రభుత్వం వరుసగా కఠిన ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్‌పై యుద్ధ చర్యలను కూడా ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఇందులో 50 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు చెబుతున్నారు. 

ఉద్రిక్తత నెలకొన్న భారత సరిహద్దులు

దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్‌పై డ్రోన్లు, క్షిపణుల దాడులకు పాల్పడింది. వీటిని భారత సైన్యం వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా భారత్ కూడా పాకిస్తాన్‌పై దాడులను తీవ్రతరం చేసింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్ పోటీలను వారం రోజుల పాటు వాయిదా వేశారు. ప్రభుత్వ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

అత్యవసర ముందుజాగ్రత్త చర్యలు

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసర ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. అత్యవసర అధికారాలను ఉపయోగించుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మందులు వంటి అన్ని అత్యవసర వస్తువులను నిల్వ చేసుకోవాలి.

వాహనాలు, జనరేటర్లు, టెంట్లు వంటివి సిద్ధంగా ఉంచుకోవాలి. పౌర రక్షణ నియమాల ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొంది.

ఏపీ, తెలంగాణలో హై అలర్ట్

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని 14 ప్రాంతాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. 

ప్రకటించారు. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, కూకట్‌పల్లి, నాంపల్లి, హైదరాబాద్ సెంట్రల్ బస్‌స్టేషన్, ట్యాంక్‌బండ్‌తో పాటు ఏపీలోని తిరుమల, విశాఖ ఆర్కే బీచ్, విజయవాడ రైల్వేస్టేషన్, విజయవాడ బస్‌స్టాండ్, ఎంజీ రోడ్‌లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

హైదరాబాద్ అంతా కూడా అలర్ట్ జోన్‌లో ఉంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ కొనసాగుతోంది. డీజీ స్థాయి అధికారి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షణలోనే సూచనలు వెళ్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దని పోలీసులు, ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్నే నమ్మాలని పోలీసులు చెబుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu