మతం లేని వ్యక్తుల ప్రయోజనాలను ప్రభుత్వం తిరస్కరించకూడదు - కేరళ హైకోర్టు

By team teluguFirst Published Aug 13, 2022, 4:56 PM IST
Highlights

మతాన్ని వదులుకున్నంత మాత్రాన వారికి వచ్చే ప్రయోజనాలను దూరం చేయకూడదు అని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏ కులానికి చెందిన వారికి సర్టిఫికెట్లు జారీ చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పౌరులు కేవలం వారి మతాన్ని వదులుకున్న కారణంతో వారికి వచ్చే ప్రయోజనాలను తిరస్కరించలేమని కేరళ హైకోర్టు శుక్రవారం పేర్కొంది. ‘‘ప్రగతిశీలిగా చెప్పుకునే ప్రభుత్వం అలాంటి పౌరులకు ప్రయోజనాలను తిరస్కరించదు. ఎందుకంటే వారు ఏ కమ్యూనిటీకి చెందినవారు కాదు ’’ అని కోర్టు పేర్కొంది. తమను తాము ఏ మ‌తానికి చెందిన వ్య‌క్తులం కాద‌ని ప్రకటించుకున్న వారికి కమ్యూనిటీ సర్టిఫికెట్లు జారీ చేయడానికి ఒక విధానాన్ని, మార్గదర్శకాలను రూపొందించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. 

వామ్మో.. పడగ విప్పిన పాము నుంచి కొడుకును కాపాడుకున్న తల్లి.. భయానక వీడియో ఇదే

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) హామీనిచ్చే ప్రయోజనాలను పొందేందుకు వీలుగా సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించాలని కోరుతూ తాము మతం లేని వర్గానికి చెందినవారమని ప్రకటించిన 12 మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఫార్వర్డ్ కమ్యూనిటీ కమిషన్ సిఫారసుల ఆధారంగా రాష్ట్రం జాబితాను విడుదల చేసిందని, అయితే అందులో కులం, వర్గాన్ని ప్రకటించిన వ్యక్తులను మాత్రమే చేర్చారని వారు పిటిష‌న్ లో పేర్కొన్నారు. మతం లేని విద్యార్థులను విద్య కోసం EWSలో చేర్చలేదని వారు తెలిపారు.

షాకింగ్ ఘటన.. గోడ‌పై మూత్రం పోశాడ‌ని చంపేశారు..

వాద‌న‌లు విన్న త‌రువాత‌ SC, ST లేదా OBC కాకుండా ఇతర వర్గాల EWS విద్యార్థులకు అందుబాటులో ఉన్న 10 శాతం రిజర్వేషన్‌ను వారు కోరే విధంగా మత రహిత కేటగిరీ కింద విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. “ వారు EWS నుండి వచ్చినట్లయితే ఆర్టికల్ 15 (6) కింద హామీ ఇవ్వబడిన ప్రయోజనాలను ఆస్వాదించడానికి వీలు కల్పించే సర్టిఫికేట్‌లకు వారు అర్హులు. వారు ఒక నిర్దిష్ట సంఘం లేదా కులంలో పుట్టినందున వారు ఎలాంటి ప్రయోజనాన్ని కోరుకోవడం లేదు” అని కోర్టు పేర్కొంది.

స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు.. ఎర్ర‌కోట చుట్టూ 10 వేల మంది పోలీసుల‌తో బందోబ‌స్తు !

ఆదాయంలో అసమానతలను తగ్గించడానికి రాష్ట్రం కృషి చేయాలని, వ్యక్తుల మధ్య హోదా, అవకాశాలలో అసమానతలను తొలగించడానికి ప్రయత్నించాలని పేర్కొంది. ‘‘ఇలాంటి ప్రయత్నాలు సంఘం, కులం, మతం ఆధారంగా పరిగణనలకు పరిమితం కాకూడదు" అని కోర్టు పేర్కొంది. 
 

click me!