దారుణం..బాలికలతో అశ్లీల నృత్యాలు, అతిథులతో సెక్స్

By ramya neerukondaFirst Published Jan 7, 2019, 12:08 PM IST
Highlights

బాలికల చేత బలవంతంగా ఒంటిపై దుస్తులు తీయించి.. భోజ్ పూరీ పాటలకు నృత్యాలు చేయించినట్లు తెలిసింది.

బిహార్ రాష్ట్రం ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్స్ బాగోతాన్ని సీబీఐ అధికారులు ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువస్తున్నారు. షెల్టర్ హోమ్స్ లో ఉండే బాలికలపై అత్యాచారం జరిగిందంటూ.. గతంలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.  కాగా.. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కాగా.. ఈ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.

షెల్టర్ హోమ్స్ లో ఉండే  బాలికలతో బలవంతంగా అశ్లీల నృత్యాలు చేయించారని.. వారిని బెదిరించి మరీ.. సెక్స్ చేసినట్లు తేలింది. బాలికల చేత బలవంతంగా ఒంటిపై దుస్తులు తీయించి.. భోజ్ పూరీ పాటలకు నృత్యాలు చేయించినట్లు తెలిసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రాజేష్ థాకూర్ ని కలిసేందుకు షెల్టర్ హోమ్స్ కి కొందరు అతిథులు వచ్చే వారని.. వారి కోరికలు తీర్చేందుకు కూడా ఈ బాలికలను వారి వద్దకు పంపించేవారని విచారణలో తేలింది. ఆకలితో అలమటిస్తున్న ఆ బాలికలకు కనీసం ఆహారం కూడా పెట్టేవారు కాదట. డ్యాన్స్ లు చేసిన వారికి మాత్రమే ఆహారం అందించేవారని బాధిత బాలికలు వివరించారు. 

షెల్టర్ హోమ్స్ కి వచ్చే అతిథులతో సెక్స్ చేయడానికి నిరాకరిస్తే.. బాలికల ప్రైవేట్ పార్ట్స్ పై దారుణంగా కొట్టేవారని బాధిత బాలికలు వివరించారు. ప్రధాన నిందితుడు బ్రాషేక్ థాకూర్ పై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.  మొత్తం షెల్టర్ హోమ్స్ లో 42మంది బాలికలు ఉండగా.. అందులో 34మందిపై లైంగిక దాడి జరిగనట్లు తేలింది. ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. 

click me!