భారతదేశ వృద్దిపై జర్మన్‌ సీఈవోల ప్రశంసలు.. ప్రధాని మోదీతో భేటీ తర్వాత కామెంట్స్..

Published : Feb 26, 2023, 10:20 AM ISTUpdated : Feb 26, 2023, 10:26 AM IST
భారతదేశ వృద్దిపై జర్మన్‌ సీఈవోల ప్రశంసలు.. ప్రధాని మోదీతో భేటీ తర్వాత కామెంట్స్..

సారాంశం

ప్రధానమంత్రి  నరేంద్ర మోదీతో జర్మనీకి చెందిన కంపెనీల సీఈవోలు శనివారం సమావేశమయ్యారు. భారతదేశంలో విద్య, వ్యాపార అవకాశాలను విస్తరించడానికి జర్మన్ కంపెనీలకు కొత్త అవకాశాలపై చర్చించారు.

ప్రధానమంత్రి  నరేంద్ర మోదీతో జర్మనీకి చెందిన కంపెనీల సీఈవోలు శనివారం సమావేశమయ్యారు. భారతదేశంలో విద్య, వ్యాపార అవకాశాలను విస్తరించడానికి జర్మన్ కంపెనీలకు కొత్త అవకాశాలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో జరిగిన సమావేశంపై ప్రశంసలు కురిపించారు.  ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా విజన్ యావత్ ప్రపంచానికి అవసరమని అభివర్ణించారు. 

టీయూవీ ఎన్‌వోఆర్‌డీ మేనేజ్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్ డిర్క్ స్టెన్‌క్యాంప్ మాట్లాడుతూ.. భారతదేశం పెరిగిన ఆత్మవిశ్వాసంతో అగ్రగామి దేశాలలో ముందంజలో ఉందని తెలిపారు. అది టేకాఫ్ చేయగల దశలో ఉందని అన్నారు. ‘‘ప్రధానమంత్రితో సమావేశం చాలా ఆకట్టుకుంది. భారతదేశం ప్రముఖ దేశాలలో ముందంజలో ఉందని.. గత రెండేళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగిందని నేను భావిస్తున్నాను. భారతదేశం నిజంగా టేకాఫ్ ప్రారంభ దశలో ఉందని నేను భావిస్తున్నాను’’ అని చెప్పారు. 

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంపై స్టెన్‌క్యాంప్ ఏఎన్‌ఐ వార్తాసంస్థతో  మాట్లాడుతూ.. ‘‘మేక్ ఇన్ ఇండియా గురించి నాకు మొదటి నుంచి తెలుసు. మేము చాలా జర్మన్ కంపెనీలు భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉత్పత్తిని ప్రారంభించడానికి మద్దతు ఇస్తున్నాం. ప్రస్తుతం మేక్ ఇన్ ఇండియాలో భాగం కావాలని భారతదేశం ఆహ్వానించడంతో జర్మనీ మిట్టెల్‌స్టాండ్‌లో ఒక చొరవ జరుగుతోంది’’ అని తెలిపారు. జర్మన్ చిన్న, మధ్యతరహా పరిశ్రమలలో ఒక చొరవ కొనసాగుతోంది.. అక్కడి వారు భారతదేశానికి వచ్చి మేక్-ఇన్-ఇండియా చొరవలో భాగం కావాలని ఆయన కోరారు. వృద్ధి, విస్తరణకు సంబంధించి భారత్‌లో అవకాశాలు అపారంగా ఉన్నాయని అన్నారు. తాము శక్తి పరివర్తనలో చాలా చురుకుగా ఉన్నామని.. అంటే శిలాజాలను వాట్స్, గాలి, మొదలైన వాటికి మార్చడం అని ఆయన చెప్పారు.

ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో స్టెన్‌క్యాంప్ కాకుండా మరో మూడు కంపెనీల ప్రతినిధి బృందం కూడా పాల్గొంది. వారిలో ఒకరైన జర్మనీకి చెందిన రెత్‌మాన్ కంపెనీ సీఈవో క్లెమెన్స్ రెత్‌మాన్ మాట్లాడుతూ.. భారతదేశానికి నైపుణ్యం, ప్రతిభ ఉందని.. ఆ వనరులను ఉపయోగించడం ఒక ప్రత్యేకత అని అన్నారు. ‘‘ఉత్పత్తి ప్రపంచంలో భారతదేశం పెద్దదిగా మారుతుంది’’ అని పేర్కొన్నారు. 

‘‘మీరు ఇక్కడ శ్రామిక శక్తిని కలిగి ఉన్నారు. అయితే జర్మనీలో శ్రామిక శక్తి తక్కువగా ఉంది. మీకు అలాంటి సంపద, నైపుణ్యం కలిగిన పని, ఏదైనా చేయాలనుకునే చాలా మంది తెలివైన యువకులు ఉన్నారు. ఆ వనరులను వినియోగించుకోవడం విశేషం. అందువల్ల ప్రధాని మోదీ భారతదేశంలో ఉత్పత్తి చేయమని మమ్మల్ని కోరారు. అయితే మా కోసం వనరులు ఇక్కడే ఉన్నాయి. మా అవకాశాలను మేము చూస్తున్నాం. కాబట్టి ఆయన మమ్మల్ని అడిగారు’’ అని రెత్‌మాన్ చెప్పారు.

రెంక్ సీఈవో సుసానే వీగాండ్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వానికి విశ్వసనీయ భాగస్వామిగా ఉన్నందుకు తాము గర్వపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కంపెనీ భారత సాయుధ దళాలకు మరియు నౌకాదళానికి డ్రైవ్ సొల్యూషన్‌లను సరఫరా చేస్తోంది. ‘‘భారతదేశం కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న సిమెంట్ మార్కెట్’’అని ఆమె తెలిపారు. ‘‘మేము మా బృందంతో బెంగళూరులో ఉన్నాం. మేము చాలా విస్తరిస్తున్నాం. భారతదేశం హై-స్పీడ్ మార్కెట్, ఆసియాలో కీలకమైన మార్కెట్ కాబట్టి మాకు కూడా ముఖ్యమైన 'మేక్ ఇన్ ఇండియా' చొరవను మేము గౌరవిస్తాము’’ అని రెంక్ పేర్కొన్నారు. 

సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎస్‌ఏపీ సీఈవో క్రిస్టియన్ క్లైన్ కూడా ప్రధాని మోదీతో సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం తరువాత క్లైన్ మాట్లాడుతూ.. భారతదేశం సుస్థిరత కోసం అధిక ఆకాంక్షలను కలిగి ఉంద..సరఫరా గొలుసులను డీకార్బనైజ్ చేయడానికి, సాంకేతికతతో చేతులు కలిపి గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి సాంకేతికతను ఉపయోగించాలని ఆయన అన్నారు. భారత్‌లో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని కూడా చెప్పారు.

ఇక, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో పాటు భారతదేశాన్ని సందర్శించే ప్రతినిధి బృందంలో అందరు సీఈవోలు ఉన్నారు. ఓలాఫ్ స్కోల్జ్ ఫిబ్రవరి 25, 26 తేదీల్లో.. రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vijay Election Campaign: రోడ్డుపై సైకిల్ తొక్కిన విజయ్ ఫ్యాన్స్ దూసుకురాగానే షాక్! | Asianet Telugu
Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu