గాంధీని గాడ్సే చంపినా.. ఈ దేశ కుమారుడే, కానీ ఔరంగజేబులా ఆక్రమణదారుడు కాదు - బీజేపీ నేత గిరిరాజ్ సింగ్

By Asianet NewsFirst Published Jun 10, 2023, 12:43 PM IST
Highlights

గాంధీని గాడ్సే హత్య చేసినప్పటికీ ఆయన ఈ దేశ సుపుత్రుడే అని.. కానీ ఔరంగజేబులా ఈ దేశ ఆక్రమణదారుడు కాదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఈ వ్యాఖ్యలను  టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ఖండించారు. 

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ నేత, కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ నిప్పులు చెరిగారు. ‘గాడ్సే గాంధీ హంతకుడైనప్పటికీ.. ఆయన కూడా దేశ కుమారుడే' అని అన్నారు. ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ లకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘గాడ్సే గాంధీ హంతకునప్పటికీ.. ఆయన కూడా దేశ కుమారుడే. అతను భారతదేశంలో జన్మించాడు. కానీ ఔరంగజేబు, బాబర్ మాదిరిగా ఆక్రమణదారుడు కాదు. బాబర్ కొడుకు అని పిలవడం ఎవరికైనా సంతోషంగా అనిపించినా ఆ వ్యక్తి భరతమాత కొడుకు కాలేడు' అని గిరిరాజ్ సింగ్ అన్నారు. నాథూరామ్ గాడ్సే భారతదేశానికి 'సపుత్' (యోగ్యమైన కుమారుడు-సుపుత్రుడు) అని, బాబర్, ఔరంగజేబుల పిల్లలుగా తమను తాము చెప్పుకోవడంలో సంతోషంగా ఉన్నవారు భారతమాత నిజమైన కుమారులు కాలేరని గిరిరాజ్ సింగ్ అన్నారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘గాడ్సే-ఆప్టేల వారసులెవరో తెలుసా’ ? కొల్హాపూర్ ఘర్షణల నేపథ్యంలో ఔరంగజేబ్ వ్యాఖ్యలపై ఫడ్నవీస్ పై ఒవైసీ ఫైర్

‘‘ఔరంగజేబ్ కీ ఔలాదీన్’’పై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించిన నేపథ్యంలో గిరిరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అకస్మాత్తుగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో ఔరంగజేబు కుమారులు పుట్టారు. వారు ఔరంగజేబు హోదాను ఉంచి తమ పోస్టర్లను చూపిస్తారు. దీంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఔరంగజేబు కుమారులు ఎక్కడి నుంచి వచ్చారు? దీని వెనుక ఎవరున్నారు? ఈ విషయాన్ని కనుగొంటాం’’ అని ఫడ్నవీస్ శుక్రవారం మీడియాతో అన్నారు. 

| Chhattisgarh: If Godse is Gandhi's killer, he is also the nation's son. He was born in India, and he was not an invader like Aurangzeb & Babar. Whosoever feels happy to be called the son of Babar, that person can't be the son of Bharat Mata: Union Minister Giriraj Singh pic.twitter.com/7GIS3z7noM

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ)

దీనికి ఒవైసీ స్పందిస్తూ.. మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 'ఔరంగజేబ్ కే ఔలాద్' అని చెప్పారని ఓవైసీ ఎదురుదాడికి దిగారు. మీకు అన్నీ తెలుసా? మీరు (ఫడ్నవీస్) అంత నిపుణుడు అని నాకు తెలియదు. అప్పుడు గాడ్సే, ఆప్టేల పిల్లలు ఎవరో కూడా తెలుసుకోవాలి. వారెవరు?’’ అని అన్నారు. 

మరో 24 గంటల్లో బలపడనున్న బిపార్జోయ్ తుఫాన్.. ఈ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం

కాగా.. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ ఖండించారు. ‘‘గిరిరాజ్ సింగ్ చెప్పినదాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నాను. జాతిపితను చంపిన వ్యక్తిని ప్రశంసిస్తూ మతపరమైన ప్రకటన చేశారు. 'బాబర్ కీ ఔలాద్' అనేది మతతత్వ ప్రజలు ఉపయోగించే పదం... మేము దానిని తిరస్కరిస్తాము. మొఘల్ చక్రవర్తులను భారతదేశానికి వ్యతిరేకంగా ప్రజలుగా ఆయన అభివర్ణించారు’’ అని తృణమూల్ ఎంపీ అన్నారు.

గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ స్పందిస్తూ.. ‘‘గాంధీని చంపిన వ్యక్తి మట్టి పుత్రుడని ఈ మంత్రి గిరిరాజ్ సింగ్ అంటున్నారు. మరోవైపు మనం గాంధీ బాటలోనే నడుస్తున్నామని ప్రధాని మోదీ ఎప్పుడూ చెబుతుంటారు. ఈ రెండు ముఖాలు ఎందుకు ?’’ అని అన్నారు. 

దారుణం.. ప్రియుడి ఇంటి వాటర్ ట్యాంకులో శవంగా తేలిన ప్రియురాలు.. అసలేం జరిగిందంటే ?

‘‘గిరిరాజ్ సింగ్: గాడ్సే భారతదేశానికి 'సపుత్' (యోగ్యమైన కుమారుడు). హంతకుడు, మొఘలుల మాదిరిగా కాకుండా భారతదేశంలో జన్మించాడు. ఈ ప్రకటన ద్వారా చాలా మంది మిమ్మల్ని భారతదేశానికి 'అర్హుడైన కుమారుడు' అని పిలవకపోవచ్చు. హంతకులను వారి మూలాలను బట్టి వేరు చేయలేం! ఈ ప్రకటనను ప్రధాని, అమిత్ షా ఖండిస్తారని ఆశిస్తున్నా’’ అని ఆయన ట్వీట్ చేశారు.

click me!