బిర్యానీ ఆశ చూపి.. డ్రగ్స్ ఇచ్చి.. చిన్నారిపై గ్యాంగ్ రేప్

By telugu news teamFirst Published Feb 10, 2021, 8:16 AM IST
Highlights

ఈ క్రమంలో నిందితుడు.. ఇటీవల తన స్నేహితుడు బాడీగార్డ్ తో కలిసి ఆ చిన్నారి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారికి బిర్యానీ ఆశ చూపి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. 


బిర్యానీ ఆశ చూపించి.. డ్రగ్స్ ఇచ్చి తొమ్మిదేళ్ల చిన్నారి పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. చైల్డ్ పోర్నోగ్రఫీకి బానిస అయిన ఓ వ్యక్తి .. బాడీగార్డుగా పనిచేస్తున్న తన స్నేహితుడితో కలిసి తొమ్మిదేళ్ల చిన్నారిపై దారుణానికి పాల్పడ్డాడు. బిర్యానీ ఆశ చూపి గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

కోల్ కతా జోరాబగన్ ప్రాంతానికి చెందిన రణ్ వీర్ తంతి అలియాస్ రఘువీర్ మార్బుల్ కటింగ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. మద్యం, చైల్డ్ పోర్నోగ్రఫీకి బానిస అయ్యాడు. ఈ క్రమంలో నిందితుడికి లాల్ బజార్ ప్రాంతానికి చెందిన  ఓ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. ఆ కుటుంబంలో తొమ్మిదేళ్ల చిన్నారి కూడా ఉంది.

ఈ క్రమంలో నిందితుడు.. ఇటీవల తన స్నేహితుడు బాడీగార్డ్ తో కలిసి ఆ చిన్నారి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారికి బిర్యానీ ఆశ చూపి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలికపై గ్యాంగ్‌ రేప్‌కు ఒడిగట్టారు. ఇక చిన్నారి బతికి ఉంటే తమను గుర్తు పడుతుందనే ఉద్దేశంతో బాలిక గొంతు కోసి హత్య చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో బాలికకు డ్రగ్స్‌ ఇచ్చినట్లు తెలుస్తోందని.. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

click me!