అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం.. డీఆర్ డీవో ను అభినందించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

By Asianet NewsFirst Published Jun 9, 2023, 9:01 AM IST
Highlights

కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని ప్రైమ్’ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని ఓ ద్వీపం నుంచి గురువారం ఈ పరీక్ష నిర్వహించారు. డీఆర్ డీవో అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. 

కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని ప్రైమ్’ను ఒడిశా తీరంలోని ఓ ద్వీపం నుంచి గురువారం విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్ డీవో) డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ పరీక్షను నిర్వహించిందని, అన్ని లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేశామని వారు తెలిపారు.

అఖండ భారత్ మ్యాప్ వివాదం : భారత భూభాగాలను కలుపుకొని ఆఫీసులో ‘గ్రేటర్ నేపాల్’ మ్యాప్ పెట్టిన ఖాట్మండు మేయర్

క్షిపణి మూడు విజయవంతమైన అభివృద్ధి పరీక్షల తరువాత నిర్వహించిన మొదటి ప్రీ-ఇండక్షన్ నైట్ ప్రయోగం ఇదేనని, ఇది వ్యవస్థ ఖచ్చితత్వం, విశ్వసనీయతను ధృవీకరించిందని తెలిపారు. రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ వంటి రేంజ్ ఇన్స్ట్రుమెంటేషన్ వ్యవస్థలను రెండు డౌన్-రేంజ్ నౌకలతో సహా వివిధ ప్రదేశాలలో మోహరించినట్లు పేర్కొన్నారు.

| First Pre Induction night launch of New Generation Ballistic Missile Agni Prime was successfully conducted off the coast of Odisha on 07 June 2023. https://t.co/gdkZozarng pic.twitter.com/26Zj2rBkON

— DRDO (@DRDO_India)

కాగా..  డీఆర్డీవో, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఉన్నతాధికారులు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా వీక్షించడంతో సాయుధ దళాల్లో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ విజయంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డీఆర్ డీవో, సాయుధ బలగాలను అభినందించారు.

 

click me!