త‌దుప‌రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవ‌రు? జ‌స్టిస్ యుయు లలిత్ ఎవ‌రిని సిఫార్సు చేయ‌నున్నారంటే? 

Published : Oct 11, 2022, 11:15 AM ISTUpdated : Oct 11, 2022, 12:34 PM IST
  త‌దుప‌రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవ‌రు? జ‌స్టిస్ యుయు లలిత్ ఎవ‌రిని సిఫార్సు చేయ‌నున్నారంటే? 

సారాంశం

జ‌స్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రధాన న్యాయమూర్తి పదవి నుంచి నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ చేసే ముందు.. త‌దుప‌రి సీజేఐగా(తన వారసుడిగా) అత్యంత సీనియర్ న్యాయమూర్తిని నియమిస్తాడు. జస్టిస్ డివై చంద్రచూడ్ దేశానికి 50వ ప్రధాన న్యాయమూర్తి కాగలరని విశ్వసిస్తున్నారు.  

భారత ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ తన వారసుడిగా జస్టిస్ డివై చంద్రచూడ్‌ను నియమించనున్నారు. మంగళవారం జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను తదుపరి సీజేఐగా నియమించాలని కేంద్రానికి లేఖను అందజేయనున్నారు. ఈ లేఖను సుప్రీంకోర్టులోని ఇతర న్యాయమూర్తుల సమక్షంలో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు అందజేయనున్నట్లు స‌మాచారం. జస్టిస్ లలిత్ కూడా ఈ అంశంపై కేంద్రన్యాయ మంత్రిత్వశాఖకు లేఖ రాయనున్నారు.

చీఫ్ జస్టిస్ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయ‌నున్న నేప‌థ్యంలో న్యాయ మంత్రి కిరణ్ రిజిజు తన వారసుడి పేరును కోరుతూ అక్టోబర్ 7 న CJI లలిత్‌కు లేఖ రాశారు. త‌దుప‌రి వారసుడి పేరు చెప్పాలని కోరారు. ఈ మేర‌కు ఆయ‌న‌ నేడు తన వారసుడి పేరును ప్రకటించనున్నారు. ఈ సమావేశం గురించి తెలియజేస్తూ న్యాయమూర్తులందరికీ సీజేఐ యూయూ లలిత్ సోమవారం లేఖ రాశారు.జస్టిస్ ఎన్వీ రమణ తర్వాత ఆగస్టులో ఆయ‌న‌ బాధ్యతలు స్వీకరించిన విష‌యం తెలిసిందే. 

ప్రోటోకాల్ ప్రకారం - ప్ర‌స్తుత సీజేఐ పదవీ విరమణ గడువు తేదీకి ఒక నెల ముందు త‌దుప‌రి త‌న వార‌సుడు (చీఫ్ జ‌స్టిస్) పేరును కోరుతూ.. సీజేఐకి న్యాయ మంత్రిత్వ శాఖ  లేఖ రాస్తుంది. ప్ర‌త్యుత్తరం సాధారణంగా సీజేఐ పదవీ విరమణ తేదీకి 28 మరియు 30 రోజుల ముందు పంపబడుతుంది. సంప్రదాయం ప్రకారం.. సీజేఐ తర్వాత సీనియారిటీ పరంగా ఆయన వారసుడిగా ఎంపికయ్యారు.

జస్టిస్ యుయు లలిత్ పదవీ విరమణ చేసిన తర్వాత సీనియారిటీ ప్ర‌కారం.. జస్టిస్ డివై చంద్రచూడ్
 సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్య‌తలు చేప‌ట్టనున్నట్టు స‌మాచారం. ఆయ‌న నవంబర్ 10, 2024న పదవీ విరమణ చేయనున్నారు.

నవంబర్ 8న సీజేఐ లలిత్ పదవీ విరమణ  

సీజేఐ యూ. యూ. లలిత్ పదవీకాలం 8 నవంబర్ 2022తో ముగుస్తుంది. ఆయన కేవలం 74 రోజులు మాత్రమే ఈ పదవిలో ఉంటారు. జ‌స్టిస్ ఎన్వీ రమ‌ణ‌ పదవీకాలం పూర్తయిన తర్వాత 26 ఆగస్టు 2022న జస్టిస్ లలిత్ దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం కేవలం రెండున్నర నెలలు కాగా, ఆయన మాజీ ప్రధాన న్యాయమూర్తుల సగటు పదవీకాలం 1.5 సంవత్సరాలు.

న్యాయస్థానం నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన రెండో సీజేఐ జస్టిస్ లలిత్. జనవరి 1971లో 13వ  సీజేఐగా నియమితులైన జస్టిస్ సీఎం సిక్రీ మొదటివారు. జస్టిస్ లలిత్ తండ్రి, జస్టిస్ యుఆర్ లలిత్ కూడా సీనియర్ న్యాయవాది, బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తి వ్యవ‌హ‌రించారు. ఏప్రిల్ 2004లో ఉన్నత న్యాయస్థానం సీనియర్ న్యాయవాదిగా నియమించబడిన సీజేఐ యూయూ లలిత్. జూన్ 1983లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఆయ‌న‌ రెండు పర్యాయాలు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లీగల్ సర్వీసెస్ కమిటీలో సభ్యునిగా ఉన్నారు. 2014లో అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

జస్టిస్ డీవై చంద్రచూడ్

జస్టిస్ డీవై చంద్రచూడ్ గతంలో 1998లో భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 2013లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. బాంబే హైకోర్టుతో కూడా ఆయనకు అనుబంధం ఉంది. 2016లో అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
 

PREV
click me!

Recommended Stories

Mumbai Family Death: వీడిన పుచ్చ‌కాయ‌, బిర్యానీ మ‌ర‌ణాల మిస్ట‌రీ.. ఇంత‌కీ వాళ్లు ఎలా చ‌నిపోయారంటే
సీఎం ఎవరు? ఉత్కంఠ రేపుతున్నతమిళ రాజకీయాలు| Tamil Nadu Political Mind Blowing Twist | Asianet Telugu