
Covid vaccination certificates: ఉత్తరప్రదేశ్తో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో, ఈ రాష్ట్రాల్లో COVID-19 టీకా ధృవీకరణ పత్రాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ప్రచురించడాన్ని తిరిగి ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. ఎన్నికల తేదీలను ప్రకటించి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత జనవరి 8న ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్ మరియు మణిపూర్ వంటి ఐదు రాష్ట్రాలలో టీకా సర్టిఫికెట్ల నుండి మోడీ ఫోటో తొలగించబడింది.
ఈ రాష్ట్రాల్లోని కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లపై ప్రధానమంత్రి ఫోటో ముద్రణను తిరిగి ప్రారంభించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. "ఈ ఐదు రాష్ట్రాల్లోని ప్రజలకు ఇస్తున్న COVID-19 సర్టిఫికేట్లలో ప్రధానమంత్రి చిత్రాన్ని చేర్చడానికి కో-విన్ ప్లాట్ఫారమ్లో అవసరమైన మార్పులు చేయబడతాయి" అని సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
2021 మార్చిలో అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మరియు పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికల సమయంలో COVID-19 సర్టిఫికేట్ల నుండి ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని మినహాయించారు. దీని కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ CoWIN ప్లాట్ఫారమ్పై అవసరమైన ఫిల్టర్లను వర్తింపజేసింది. కొన్ని రాజకీయ పార్టీలు లేవనెత్తిన ఫిర్యాదుల మేరకు కమిషన్. ఫలితాల ప్రకటన తర్వాత కోవిడ్-19 సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫోటో పునరుద్ధరించబడుతుందని తెలిపింది.
కాగా, గతంలో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పై ప్రధాని మోడీ ఫొటోను ముద్రించడంపై పలు రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలోనే పలువురు వ్యక్తులు న్యాయస్థానాలను సైతం ఆశ్రయించారు. అయితే, కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను తొలగించాలనే పిటిషన్ను కేరళ హైకోర్టు కొట్టివేస్తూ.. పిటిషనర్ కు ₹ 1 లక్ష జరిమానా విధించింది. ఈ పిటిషన్ అనవసర.. రాజక్రీయ ప్రేరణతో వేయబడిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం అని పేర్కొంది. ‘‘ప్రధానమంత్రిని కాంగ్రెస్ ప్రధాని అని గానీ, బీజేపీ ప్రధాని అని గానీ, ఏ రాజకీయ పార్టీకి ప్రధాని అని గానీ ఎవరూ చెప్పలేరు. కానీ రాజ్యాంగం ప్రకారం ఒకసారి ప్రధాని ఎన్నికైతే, ఆయనే మన దేశానికి, ఆ పదవికి ప్రధానమంత్రి. ప్రతి పౌరుడికి గర్వకారణంగా ఉండాలి’’ అని ఈ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం పేర్కొంది. కాగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 182.8 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. 91.2 కోట్ల మందికి మొదటి డోసు అందించగా.. 79 కోట్ల మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.