Budget 2024: నిర్మ‌లా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ తో ఇస్రోకు బూస్ట్.. !

Published : Feb 01, 2024, 03:50 PM IST
Budget 2024: నిర్మ‌లా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ తో ఇస్రోకు బూస్ట్.. !

సారాంశం

India Budget 2024-25: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్ ను పార్ల‌మెంట్ లో ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 13,042.75 కోట్లు ఇస్రోకు కేటాయించి భారత ప్రభుత్వం అంతరిక్ష శాఖకు బడ్జెట్ కేటాయింపుల్లో గణనీయమైన పెరుగుదలను ప్రకటించింది.  

Budget 2024-25 ISRO: అంత‌రిక్ష రంగంలో భార‌త్ తిర‌గులేని విజ‌యాల‌తో ముందుకు సాగుతోంది. ఇస్రో స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టిస్తూ అన్ని దేశాల‌కు స‌వాలు విసురుతోంది. ఇస్రోకు మ‌రింత బూస్టును ఇస్తూ బ‌డ్జెట్ లో కేటాయింపులు పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.13,042.75 కోట్లు కేటాయిస్తూ అంతరిక్ష శాఖకు బడ్జెట్ కేటాయింపులను గణనీయంగా పెంచుతున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.

ఇస్రోకు అంతక్రితం ఏడాది బడ్జెట్ రూ.12,543.91 కోట్లతో పోలిస్తే ఇది రూ.498.84 కోట్లు అధికం కావ‌డం విశేషం. చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్ 1 వంటి భారీ మిషన్లను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత కేటాయింపులు పెర‌గ‌డం, అంతరిక్ష అన్వేషణ సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో భారతదేశం నిబద్ధతను నొక్కిచెబుతున్నాయి. 2035 నాటికి తొలి భారతీయుడిని అంతరిక్షంలోకి పంపడం, ప్రత్యేక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడం లక్ష్యంగా ప్రతిష్టాత్మక గగన్ యాన్ మిషన్ ను ఇస్రో చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ ఖర్చుతో కూడిన మిషన్లను నిర్వహించడంలో పేరొందిన ఇస్రో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంతో పాటు పెద్ద, దీర్ఘకాలిక మిషన్లను ముందుకు తీసుకెళ్ల‌డంలో కృషి చేస్తున్న స‌మ‌యంలో కేంద్రం నిధుల కేటాయింపుల‌ను పెంచ‌డంపై హర్షం వ్యక్తం చేసింది.

Budget 2024: 'గేమ్-ఛేంజర్' ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్ క‌థేంటో తెలుసా?

సైన్స్ అండ్ టెక్నాలజీకి మ‌రింత‌ ప్రోత్సాహం

సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి 2024-25 సంవత్సరానికి రూ .16,603.94 కోట్ల కేటాయింపులు జ‌రిగాయి. ఇది గత సంవత్సరం కేటాయించిన రూ .16,361 కోట్లతో పోలిస్తే రూ .242 కోట్లు ఎక్కువ. వివిధ రంగాలలో శాస్త్రీయ పరిశోధన-అభివృద్ధిని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కేటాయింపులను సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని మూడు కీలక విభాగాలకు పంపిణీ చేయనున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి రూ.8,029.01 కోట్లు, బయోటెక్నాలజీ విభాగానికి రూ.2,251.52 కోట్లు కేటాయించారు. అదనంగా రూ.6,323.41 కోట్లు కేటాయించడం వల్ల డిపార్ట్ మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు ప్రయోజనం చేకూరనుంది.

Petrol Diesel Price: బడ్జెట్ 2024-25 వేళ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..?

అలాగే, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు రూ.3,265.53 కోట్లు మంజూరు చేసింది. రూ.2,521.83 కోట్లతో భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఓషనోగ్రఫీ, వాతావరణ శాస్త్రం, భూకంప శాస్త్రం వంటి రంగాల్లో కీలకమైన పరిశోధనలకు మద్దతు కొనసాగిస్తుంది. ఈ పెట్టుబడులతో, దేశ శాస్త్రీయ సమాజాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం, ప్రపంచ జ్ఞానానికి దోహదపడే అద్భుతమైన ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతికి వీలు కల్పించడం, మానవాళి-భూగోళం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను పరిష్కరించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది.. ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామన్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu
Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu