PM Modi Hyderabad Visit: తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

By Mahesh RajamoniFirst Published Jul 3, 2022, 3:22 PM IST
Highlights

BJP NEC in Hyderabad: హైద‌రాబాద్ లో రెండు రోజుల బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం కొన‌సాగుతోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ ప్ర‌తినిధులు దీనికి హాజ‌ర‌య్యారు. 
 

Assam CM Himanta Biswa Sharma: తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ అన్నారు. వివ‌రాల్లోకెళ్తే.. ఆదివారం నాడు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. జూలై 3న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం రెండో రోజుతో పాటు చివ‌రి రోజుకూడా. ఈ స‌మావేశం సాయంత్రం 4 గంటలకు ముగిసే అవకాశం ఉంది. రెండు రోజుల ఈ స‌మావేశం ముగిసిన త‌ర్వాత సాయంత్రం 6 గంటలకు ప్రధాని న‌రేంద్ర మోడీ బ‌హిరంగ ప్రసంగం చేస్తారు.

హైద‌రాబాద్‌లోని ప‌రేడ్ గ్రౌండ్స్ లో 'విజయ్ సంకల్ప సభ' పేరుతో జరిగే  బహిరంగ సభలో ప్ర‌ధాని మోడీతో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులు, పార్టీ నేత‌లు పాల్గొన‌నున్నారు. తెలంగాణాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నద్ధతకు సంబంధించి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కీల‌క వ్యాఖ్య‌లు చేసే అవ‌కాశ‌ముంది. ఈ బహిరంగ సభకు  భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు హాజరయ్యే అవకాశం ఉంది. ప్ర‌ధాని మోడీ తన పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగం మొత్తం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అతిపెద్ద హైలైట్ అవుతుంది, రాబోయే కాలంలో ముఖ్యంగా గుజరాత్ వంటి పెద్ద రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కు సంబంధించి రోడ్‌మ్యాప్‌ను ప్ర‌క‌టిస్తార‌ని భావిస్తున్నారు. ప్ర‌ధాని మోడీ త‌న ప్ర‌సంగంలో పార్టీని బ‌లోపేతం చేయ‌డంతో పాటు అట్ట‌డుగు వ‌ర్గాల‌కు మ‌రింత చేరువ‌య్యేలా ఎలా ప‌నిచేయాలో అనే సూచ‌న‌లు అందించే అవ‌కాశ‌ముంది. కొన్ని ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌స్తావించ‌డంతో పాటు ప్ర‌తిప‌క్షాల టార్గెట్ గా ప్ర‌సంగం సాగ‌నుంద‌ని స‌మాచారం. 

తెలంగాణ‌లో కొత్త స‌ర్కారు.. అసోం సీఎం 

“కేంద్ర హోంమ‌త్రి కూడా ప్రతిపక్షాల గురించి మాట్లాడారు. నేడు ప్రతిపక్షాలు చీలిపోయాయని అన్నారు. పార్టీలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని కాంగ్రెస్ సభ్యులు పోరాడుతున్నారని, అయితే భయంతో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌కు మోడీ ఫోబియా ఉంది. జాతీయ ప్రయోజనాల కోసం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు” అని అసోం సీఎం అన్నారు. “కాంగ్రెస్ మోడీ ఫోబియాగా మారిందని, దేశ ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించడం ప్రారంభించిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ పూర్తిగా నిరాశ మరియు నిస్పృహలో ఉంది అని ఆయ‌న అన్నారు. తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని  తెలిపారు.

 

HM Amit Shah called the Supreme Court judgement, over Gujarat riots, historic. He said that all the allegations were declared false by the Supreme Court and the court called it politically inspired: Assam CM and BJP leader Himanta Biswa Sarma, in Hyderabad, Telangana pic.twitter.com/h1IwWg3gZK

— ANI (@ANI)

Read more:

Maharashtra Political Crisis: మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఎవ‌రో తెలుసా?

Earthquake: చైనాలో భూకంపం.. రిక్ట‌ర్ స్కేల్‌పై 5.2 తీవ్ర‌త న‌మోదు

ఫాస్ట్ గా బరువు తగ్గి.. స్లిమ్ గా అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ ను ఫాలో అయిపోండి

 

click me!