ప్రపంచంలోని హిందువులంతా ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వాలి - ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Published : Nov 25, 2023, 11:06 AM IST
ప్రపంచంలోని హిందువులంతా ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వాలి - ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

సారాంశం

ప్రపంచంలోని హిందువులంతా ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (RSS chief Mohan Bhagwat) అన్నారు. వసుధైవ కుటుంబకం  స్ఫూర్తిని వ్యాప్తి చేయడంలో హిందువులు కీలక పాత్ర పోషించాలని కోరారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఒకరికొకరు అనుసంధానం కావాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ (RSS chief Mohan Bhagwat) విజ్ఞప్తి చేశారు. థాయ్ లాండ్ లోని బ్యాంకాక్ లో జరిగిన వరల్డ్ హిందూ కాంగ్రెస్ ( World Hindu Congress) ప్రారంభ సమావేశానికి మోహన్ భగవత్ శుక్రవారం హాజరై ప్రసంగించారు. భౌతికవాదం, కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం వంటి అనేక ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా ప్రపంచం సంతృప్తిని సాధించలేదని అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి తర్వాత పునరాలోచనను పునఃప్రారంభించామని తెలిపారు.

భళా కంబళ.. తొలిసారిగా బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్ లో నిర్వహణ.. ఏమిటీ పోటీలు.. ? (ఫొటోలు)

‘‘నేటి ప్రపంచం ఇప్పుడు కుదేలవుతోంది. 2,000 సంవత్సరాలుగా వారు సంతోషం, ఆనందం, శాంతిని తీసుకురావడానికి అనేక ప్రయోగాలు చేశారు. వారు భౌతికవాదం, కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానాన్ని ప్రయత్నించారు. వీరు వివిధ మతాలను ప్రయత్నించారు. వారు భౌతిక శ్రేయస్సును పొందారు. కానీ తృప్తి లేదు... భరత్ దారి చూపిస్తుందని వారు ఏకాభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.’’ అని అన్నారు. 

వసుధైవ కుటుంబకం (ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం) స్ఫూర్తిని వ్యాప్తి చేయడంలో హిందువులు కీలక పాత్ర పోషించాలని భగవత్ కోరారు. ‘‘ప్రతీ హిందువుతో కనెక్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కరినీ సంప్రదించి, కనెక్ట్ అయ్యి, మన సేవ ద్వారా ఆయనను మన దగ్గరకు తీసుకురావాలి. హృదయాలను తప్ప మరేమీ గెలుచుకోవద్దు’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు.

Rajasthan Election 2023: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడే .. బరిలో నిలిచిన ప్రముఖులు వీరే..

కోపం, అసూయ, అహంకార ప్రవర్తన వంటి ప్రతికూల భావోద్వేగాలు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని, వ్యక్తుల మధ్య సహకారాన్ని అడ్డుకుంటున్నాయని తెలిపారు. నిస్వార్థ సేవ ద్వారా హృదయాలను గెలుచుకోవాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. 

సెల్యూట్ తల్లీ.. వలస కార్మికురాలి బిడ్డకు పాలిచ్చి మానవత్వం చాటుకున్న మహిళా పోలీసు

ఇదిలా ఉండగా.. వరల్డ్ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, గ్లోబల్ చైర్మన్ స్వామి విజ్ఞానానంద ( Swami Vigyanananda)ఆధ్వర్యంలో థాయ్ లాండ్ లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. డబ్ల్యూహెచ్ సీ సెషన్లో ఆధ్యాత్మిక నాయకురాలు మాతా అమృతానందమయి దేవి, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే సహా 60 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం