పేదల ఇండ్లను కూలుస్తూ.. దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్న బీజేపీ: మోడీ సర్కారుపై అఖిలేష్ యాదవ్ ఫైర్

Published : Feb 21, 2023, 08:14 PM IST
పేదల ఇండ్లను కూలుస్తూ.. దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్న బీజేపీ: మోడీ సర్కారుపై అఖిలేష్ యాదవ్ ఫైర్

సారాంశం

Lucknow: బీజేపీ బుల్డోజర్ విధానం విదేశాల్లో దేశ ప్రతిష్టను దెబ్బతీసిందని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ముగిసిన పెట్టుబడిదారుల సదస్సును ప్రస్తావిస్తూ అధికార బీజేపీ ప్రజలకు కలలను అమ్ముకుంటోందని ఆరోపించారు.

Samajwadi Party chief Akhilesh Yadav: బీజేపీ ప్రభుత్వ 'బుల్డోజర్ పాలసీ', ఇటీవల బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు విదేశాల్లో దేశ ప్రతిష్ఠను దెబ్బతీసింద‌నీ, ఆయా ప‌రిస్థితులు భార‌త్ కు రాకుండా పెట్టుబ‌డిదారుల‌ను అడ్డుకునే ప‌రిస్థితుల‌ను క‌ల్పించాయ‌ని స‌మాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ముగిసిన పెట్టుబడిదారుల సదస్సును ప్రస్తావిస్తూ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికార బీజేపీ ప్రజలకు కలలను అమ్ముకుంటోందని విమర్శించారు. "పేదల ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్న చిత్రాలను ప్రపంచం చూసింది. బీబీసీ వంటి సంస్థపై బీజేపీ దాడులు చేసి మీడియాను భయపెడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దేశంలో పెట్టుబడులు పెడతారని ఆశిస్తున్నారా?.."  అని ప్రశ్నించారు.

ఉత్తరప్రదేశ్ కు రూ.40 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్న కలలను బీజేపీ ప్రజలకు అమ్ముకుంటోందని పెట్టుబడిదారుల సదస్సును ఉద్దేశించి అన్నారు. "ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగిసిన తర్వాత ఇన్వెస్టర్లు వచ్చి వెళ్లారు. పెట్టుబడిదారుల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన టెంట్ సిటీలో ఎవరూ బస చేయలేదని ప్రభుత్వం మీకు చెప్పదు. కానీ వాటిలో ఎంత మంది ఇన్వెస్టర్లు ఉన్నారో మీరు (మీడియా) తెలుసుకోండి. ఎందుకంటే అవ‌న్నీ ఖాళీగా ఉన్నాయి" అని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. అక్రమ భవనాల కూల్చివేతకు ఉపయోగించే బుల్డోజర్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు 'బుల్డోజర్ బాబా' బిరుదుతో ప్ర‌తిపక్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఓ గ్రామంలో ఆక్రమణల వ్యతిరేక ఉద్యమంలో 45 ఏళ్ల మహిళ, ఆమె 20 ఏళ్ల కుమార్తె ప్రాణాలు కోల్పోయారు.

బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో 2023-24 బడ్జెట్ ను ప్రవేశపెట్టడంపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. 'ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఆరు బడ్జెట్లు తీసుకువ‌చ్చింది. ఎవరెవరికి ఏం దక్కింది? ఎవ్వరికీ ఏమీ దొరకలేదు... రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు' అంటూ విమ‌ర్శించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కొత్త రికార్డులు నెలకోల్పుతున్నాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో పాటు కూరగాయలు, ఆహార పదార్థాలైన నిత్యావసరాల ధరలు పెరిగాయని పేర్కొన్నారు. ఇది ప్ర‌జ‌ల జీవితాల‌ను భారంగా మార్చింద‌ని తెలిపారు. సోమవారం విధానభవన్ ఆవరణలో ఎస్పీ సభ్యులు చేపట్టిన నిరసన సందర్భంగా భద్రతా సిబ్బంది మీడియా ప్రతినిధులపై దాడి చేయడం దురదృష్టకరమనీ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu
RBI : సైబర్ దొంగతనాలకు 'కిల్ స్విచ్' తో చెక్.. అంటే ఏమిటో తెలుసా..?