Airplane crash in Ahmedabad : కుప్పకూలిన విమానంలో ఇండియన్స్ ఎంతమంది? విదేశీయులు ఎంతమంది?

Published : Jun 12, 2025, 03:47 PM ISTUpdated : Jun 12, 2025, 03:53 PM IST
India air crash history

సారాంశం

అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిరిండియా విమానం భారతీయులతో పాటు చాలామంది విదేశీయులు ఉన్నారు. ఏయే దేశాలకు చెందినవారు ఉన్నారో తెలుసా? 

Air India : గుజరాత్ లో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురయ్యింది. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుండి లండన్ కు ప్రయాణికులతో బయలుదేరిని విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. టేకాఫ్ అయినవెంటనే విమానం కూలిపోయింది... ఈ ప్రమాద సమయంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.

ఇండియా నుండి లండన్ కు బయలుదేరిన ఈ విమానంలో భారతీయులే కాదు విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 242 మంది ప్రయాణికుల్లో అత్యధికంగా 169 మంది ఇండియన్స్ కాగా మిగతావారంతా విదేశీయులే. బ్రిటన్ కు చెందినవారు 53 మంది ఉండగా పోర్చుగీస్ 7, కెనడాకు చెందినవారు 1 ఉన్నారు.

 

 

ఇండియన్ ప్యాసింజర్స్ లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఇదే విమానంలో ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇదేందయ్యా ఇదీ.. కర్ణాటక రాజధాని బెంగళూరులో కన్నడ మాట్లాడేవారు తక్కువా..!
హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు గంట‌లో వెళ్లిపోవ‌చ్చు.. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌లో మ‌రో కీల‌క అడుగు