అప్ఘానిస్తాన్ బార్డర్లో భూకంపం... ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు

Published : Apr 19, 2025, 06:58 PM IST
అప్ఘానిస్తాన్ బార్డర్లో భూకంపం... ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు

సారాంశం

శనివారం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు కాశ్మీర్, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా కనిపించాయి... దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. 

శనివారం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో 5.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీని ప్రభావం ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్‌లలో కనిపించింది... కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది.

ఎన్సిఎస్ ప్రకారం భూకంపం మధ్యాహ్నం 12:17 గంటలకు చోటుచేసుకుంది. భూకంప కేంద్రం 86 కి.మీ. లోతులో ఉంది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్-తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి. 

కాశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ భూకంప సమయంలో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుండి బయటకు పరుగెత్తుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కొంతమేర ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !
ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇకలేరు | Indian Cinema Legend Bharathiraja Passes Away| Asianet Telugu