నేడు భారత్‌కు రానున్న మరో 12 చిరుతలు.. కునో నేషనల్ పార్క్‌లో నెల రోజుల పాటు క్వారంటైన్‌

Published : Feb 18, 2023, 06:33 AM IST
నేడు భారత్‌కు రానున్న మరో 12 చిరుతలు.. కునో నేషనల్ పార్క్‌లో నెల రోజుల పాటు క్వారంటైన్‌

సారాంశం

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిరుత పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కి రెండో బ్యాచ్ చిరుతలు నేడు రానున్నాయి. ఇందుకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతలతో కూడిన రెండో విడత శనివారం ఉదయం 10 గంటలకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు చేరుకోనున్నది.

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిరుత పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా నేడు (శనివారం) దక్షిణాఫ్రికా నుండి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కి రెండో బ్యాచ్‌  చీతాలు రానున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారులు సన్నాహాలు చేశారు. రెండో విడుతలో ఏడు మగ చిరుతలు, ఐదు ఆడ చిరుతలు ఉన్నాయట. వీటిని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లు కునో నేషనల్ పార్క్‌లోని తమ క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లలోకి చిరుతలను వదులుతారని మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారి మీడియాకు తెలిపారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా హాజరవుతారని భావిస్తున్నారు. కానీ, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.  ప్రతిష్టాత్మకమైన చిరుత పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది సెప్టెంబర్ 17న తన 72వ పుట్టినరోజు సందర్భంగా నమీబియా నుండి కునోలోని క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లోకి ఐదు ఆడపిల్లలతో సహా ఎనిమిది చిరుతలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతలను తీసుకురావడానికి భారత వైమానిక దళం (IAF) యొక్క C-17 గ్లోబ్ మాస్టర్ గురువారం ఉదయం 6 గంటలకు హిండన్ విమానాశ్రయం నుండి బయలుదేరినట్లు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) హెడ్ SP యాదవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. శుక్రవారం సాయంత్రం గౌటెంగ్‌లోని ఓఆర్‌ టాంబో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చిరుతలు కునోకు ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి.

రవాణా విమానం శనివారం ఉదయం 10 గంటలకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ల్యాండ్ అవుతుందనీ, ఐఏఎఫ్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్లలో ఈ ప్రయాణాన్ని కవర్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 11 గంటలకు సీఎం చౌహాన్ ,కేంద్ర మంత్రి యాదవ్ చిరుతలను క్యారంటైన్ లోకి పంపనున్నారని మధ్యప్రదేశ్ ఫారెస్ట్ ఫోర్స్ హెడ్ రమేష్ గుప్తా తెలిపారు. 

కునో నేషనల్ పార్క్‌లో 8 చిరుతలు  

ప్రస్తుతం కునోలోని ఈ ఎనిమిది చిరుతలు మూడు, నాలుగు రోజుల్లో వేటాడాయని, వాటి ఆరోగ్యం బాగానే ఉందని అధికారులు తెలిపారు. ఒక ఆడ చిరుతపులికి క్రియాటినిన్ స్థాయి పెరగడంతో ఆరోగ్యం బాగాలేదని, అయితే చికిత్స అనంతరం ఆమె పరిస్థితి బాగానే ఉందని ఆయన తెలిపారు. సీరంలోని క్రియాటినిన్ స్థాయి మూత్రపిండాల ఆరోగ్యం , పనితీరును గుర్తించడంలో సహాయపడుతుంది.

గతేడాది ఇరుదేశాల మధ్య ఒప్పందం

ఆఫ్రికా దేశం నుంచి చిరుతలను తీసుకొచ్చి కునోలో పునరావాసం కల్పించేందుకు భారత్, దక్షిణాఫ్రికా గత ఏడాది జనవరిలో ఎంఓయూపై సంతకాలు చేశాయి. ప్రపంచంలోని 7,000 చిరుతల్లో ఎక్కువ భాగం దక్షిణాఫ్రికా, నమీబియా , బోట్స్వానాలో నివసిస్తున్నాయి. నమీబియాలో చిరుతలు అత్యధికంగా ఉన్నాయి.

ప్రధానంగా మితిమీరిన వేట , ఆవాసాల కొరత కారణంగా భారతదేశంలో పూర్తిగా అంతరించిపోయాయి. భారతదేశంలో చివరి చిరుత 1948లో ఛత్తీస్‌గఢ్‌లోని కొరయా జిల్లా సాల్ అడవిలో చనిపోయింది.భారత్‌లో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత చిరుత జాతులు అంతరించిపోయిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీ, ప్రిటోరియా మధ్య ఇటీవల ఒప్పందం కుదిరిన తర్వాత, ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి చిరుతలను భారత్‌కు తీసుకురావడానికి మార్గం సుగమమైంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

జంతర్ మంతర్ సీజన్2 రాబోతోంది: అభిజిత్ దీప్కే | Jantar Mantar Season 2 | Cockroach Janta Party
అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ తెలుగులో | Tamil Nadu Assembly | CM Vijay Speech in Telugu