ఐరాస భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం కోసం ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌ల మద్దతు.. ‘కౌన్సిల్‌ను విస్తరించాలి’

Published : Nov 19, 2022, 01:16 PM IST
ఐరాస భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం కోసం ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌ల మద్దతు.. ‘కౌన్సిల్‌ను విస్తరించాలి’

సారాంశం

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం భారత్‌కు ఇవ్వాలని ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌లు తమ మద్దతు తెలిపాయి. అంతేకాదు, ఐరాస భద్రతా మండలిని విస్తృతం చేయాలని అభిప్రాయపడ్డాయి. 15 దేశాల సభ్యత్వం గల ఐరాస భద్రతా మండలిలో కేవలం ఐదు దేశాలు మాత్రమే శాశ్వత సభ్యత్వాన్ని, వీటో అధికారాన్ని కలిగి ఉన్నాయి.  

న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని విస్తరించాలని పలు దేశాలు అభిప్రాయపడ్డాయి. ఆ విస్తరించిన భద్రతా మండలిలో భారత్‌కు తప్పకుండా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌లు గళమెత్తాయి. సెక్యూరిటీ కౌన్సిల్‌లో శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. శాశ్వత సభ్య దేశాలకు వీటో అధికారం ఉంటుంది. శాశ్వత సభ్యత్వాన్ని అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, చైనా, రష్యాలు కలిగి ఉన్నాయి.

భద్రతా మండలిలో సభ్యత్వాలను పెంచడం, ప్రపంచవ్యాప్తంగా సమాన ప్రాతినిధ్యం అందించడం, ఇతర కీలక విషయాలపై ఐరాస సాధారణ సమావేశంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫ్రాన్స్ డిప్యూటీ పర్మనెంట్ రిప్రెజెంటేటివ్ ఆఫ్ ఫ్రాన్స్ నతాలీ బ్రాడ్ హరస్ట్ ఈ రోజు మాట్లాడారు.

‘ఫ్రాన్స్ వైఖరి స్థిరమైనది, అందరికీ తెలిసినదే. నేటి ప్రపంచానికి అనుగుణంగా ప్రాతినిధ్యాన్ని అందించేలా, ఐరాస అధికారం, దాని పనితీరు మరింత మెరుగుపరిచేలా నిర్ణయాలు తీసుకోవాలి’ అని అన్నారు. ప్రపంచంలో కొత్త శక్తుల అవతరణ, సెక్యూరిటీ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం కోసం తహతహలాడుతున్న దేశాలను చూడాల్సి ఉన్నదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితల రీత్యా మండలి సభ్యుల సంఖ్యను 25 కు పెంచడం ఉత్తమం అని చెప్పారు.

Also Read: భారత్‌కు యూఎన్ఎస్సీ సభ్యత్వాన్ని వ్య‌తిరేకిస్తున్న పాకిస్థాన్

ఈ శాశ్వత మండలి లో జర్మనీ, బ్రెజిల్, ఇండియా, జపాన్‌లకు అవకాశం ఇవ్వాలని తాము కోరుతున్నట్టు ఫ్రాన్స్ పేర్కొన్నారు. అంతేకాదు, ఇందులో ఆఫ్రికా దేశాలూ ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇక వీటో అనేది చాలా సున్నితమైన విషయం అని, అది శాశ్వత సభ్యత్వం ఆశిస్తున్న దేశాలది వివరించారు. సామాజిక ఊచకోత లేదా ఇతర నరమేధాలు జరుగుతున్నప్పుడు వీటో అధికారాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలని కోరారు.

యూకే కూడా భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం డిమాండ్ చేసింది. భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్యత్వాలను పెంచాలనే కొన్నేళ్ల నుంచి తాము కూడా చెబుతున్నామని యూకే అంబాసిడర్ బార్బరా వుడ్‌వర్డ్ తెలిపారు. ఇండియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్ దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి తాము మద్దతు తెలుపుతున్నామని వివరించారు. ఆఫ్రికా ఖండం నుంచి కూడా ఇందులో ప్రాతినిధ్యం ఉండాలని అభిప్రాయపడ్డారు.

15 దేశాల భద్రతా మండలిలో యూఎస్, యూకే, ఫ్రాన్స్, రష్యాలు భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు తెలిపాయి. ఒక్క చైనా మాత్రమే మద్దతు తెలుపాల్సి ఉన్నది. భారత్ ప్రస్తుతం తాత్కాలిక సభ్యదేశంగా ఉన్నది. ఈ రెండేళ్ల తాత్కాలిక సభ్యత్వం కూడా వచ్చే నెలతో ముగియనుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !