ఇంటి ఓనర్‌పై కన్ను: రేప్ చేసి, దారుణహత్య.. కీలకంగా మారిన చిలుక సాక్ష్యం

By Siva KodatiFirst Published May 26, 2020, 4:40 PM IST
Highlights

చిలుకలు మాట్లాడితే  ఎంతో అందంగా ఉంటుంది. చాలామంది వాటితో మాటలు మాట్లాడించి ఆడుకుంటూ ఉంటారు. తాజాగా ఓ అత్యాచార కేసులో చిలుక సాక్ష్యం కీలకంగా మారనుంది.

చిలుకలు మాట్లాడితే  ఎంతో అందంగా ఉంటుంది. చాలామంది వాటితో మాటలు మాట్లాడించి ఆడుకుంటూ ఉంటారు. తాజాగా ఓ అత్యాచార కేసులో చిలుక సాక్ష్యం కీలకంగా మారనుంది. తన యజమానురాలి చివరి మాటలను నోటి వెంట పలుకుతూ ఆమె చావుకు కారణమైన వారిని కటకటాల వెనక్కు నెట్టనుంది.

వివరాల్లోకి వెళితే.. అర్జెంటీనాలోని సాన్ ఫెర్నాడోకు చెందిన ఎలిజబెత్ టోలెడొ అనే మహిళ ఇంటిపైన ముగ్గురు  వ్యక్తులు అద్దెకు దిగారు. వీరిలో ఇద్దరు ఇంటి ఓనర్‌పైనే కన్నేశారు.

ఈ క్రమంలో 2018 డిసెంబర్‌లో ఓ ఆరోజు ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా వారికి ‘‘ ప్లీజ్... నన్ను వదిలేయండి’’ అంటూ అర్ధిస్తున్న శబ్ధాలు వినిపించాయి.

ఆశ్చర్యపోయిన పోలీసులు ఆ మాటలు వినిపిస్తున్న వైపు చూడగా.. నగ్నంగా, నిర్జీవంగా పడివున్న ఓ మహిళ మృతదేహం పక్కన బోనులో ఉన్న చిలుక పలుకులు వినిపించాయి. బాధితురాలిని హింసిస్తూ, అత్యాచారం చేసినప్పుడు ఆమె దుండగులను వేడుకున్న మాటలను చిలుక గ్రహించి వాటినే ఉచ్ఛరించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇక ఈ ఘటన కంటే ముందే నిందితులు ఇంట్లోకి చొరబడిన వెంటనే చిలుక ‘‘ నన్ను ఎందుకు కొడుతున్నారు’’ అంటూ మృతురాలి మాటలను తిరిగి పలికింది. ఈ మాటలను తాము చెవులారా విన్నామంటూ ఇరుగు పొరుగు వారు పేర్కొన్నారు. దీంతో ఈ హత్యాచారం కేసులో చిలుక సాక్ష్యం కీలకంగా మారింది.

ఇదే సమయంలో పోస్ట్‌మార్టం నివేదికలోనూ.. బాధితురాలిని కొట్టి, అత్యాచారం చేసి, గొంతు కోసి చంపినట్లు వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే ఈ కేసు కోర్టు ముందు విచారణకు రానుంది. 

click me!