ఏషియానెట్-తెలుగు క్రైమ్ న్యూస్

First Published Sep 17, 2017, 12:17 PM IST
Highlights

విశేష వార్తలు

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం,ఇద్దరి మృతి
  • శంషాబాద్ ఎయిర్‌పోర్టులో  పట్టుబడ్డ అక్రమ బంగారం 
  • భైంసాలో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్ లో అర్దరాత్రి యువకుడిపై ఇలా దాడి చేశారు (వీడియో) 

మాదాపూర్ లో అర్దరాత్రి ఓ  యువకుడిని పట్టుకుని ముగ్గురు వ్యక్తులు చితకబాదారు. రోడ్డుపై నిల్చున్న యువకుడిపై స్కూటీపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు పిడిగుద్దులు కురిపించారు. అతడు తనను తాను కాపాడుకోడానికి సమీపంలోని ఇంట్లోకి వెళ్లినా వదలకుండా రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం,ఇద్దరి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి మండలం లో ఆర్టీసి బస్సు ను టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మద్దుకూరు గ్రామం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో  మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. 
 

భైంసాలో యువకుడి దారుణ హత్య 

నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణ శివారులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణానికి చెందిన సూర్యకాంత్ ను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి, శవాన్ని భైపాస్ రోడ్ పక్కన పడేశారు.  సంఘటనస్థలంలో మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, ఆధారాల కోసం తనిఖీలు చేశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ అక్రమ బంగారం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 400 గ్రాముల బంగారు బిస్కట్లు పట్టుబడ్డాయి.  దుబాయి నుండి  వచ్చిన ఓ వచ్చిన ప్రయానికుడి వద్ద ఈ బంగారం దొరికింది.  బంగారాన్నిస్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

click me!