రోజ్ వాటర్ చర్మాన్ని కాంతివంతం చేయడంతో పాటు చర్మం వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది. రెండు చెంచాల రోజ్ వాటర్, అలోవెరా జెల్ కలిపి ప్యాక్ తయారు చేయండి. తర్వాత ఈ ప్యాక్ని మీ ముఖం , మెడకు అప్లై చేయండి. ఆరిన తర్వాత కడిగేయాలి. ముఖాన్ని కాంతివంతంగా మార్చేందుకు ఈ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది.
అలోవేరా జెల్, విటమిన్ ఇ క్యాప్సిల్: ఒక కప్పులో అలోవెరా జెల్ (Aloevera gel), విటమిన్ ఇ క్యాప్సిల్ (Vitamin E capsule) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంగు మచ్చలపై అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకుంటే మంగు మచ్చలు తగ్గడంతో పాటు మొటిమలు, నల్లటి వలయాలు వంటి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.