ముందుగా, ఒక గిన్నెలో, శనగపిండి, కలబంద జెల్,పసుపు కలపండి. ఇప్పుడు రోజ్ వాటర్ లేదా పాలు వేసి నునుపైన పేస్ట్ తయారు చేయండి. ఈ పేస్ట్ ను మీ ముఖం మీద శుభ్రమైన, పొడి చర్మంపై జుట్టు పెరిగే దిశలో సమానంగా పూయండి. దీని తరువాత, మీ ముఖం మీద 15-20 నిమిషాలు ఆరనివ్వండి. దీని తరువాత, గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడుక్కుంటూ సర్కిల్ మోషనల్ తిప్పాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల.. హెయిర్ పోవడంతో పాటు.. ముఖం స్మూత్ గా, మెరుస్తూ కనపడుతుంది.