స్నానం చేయడానికి ముందు ఇలా చేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం..!

First Published Jun 14, 2024, 3:13 PM IST

వయసు పెరుగుతున్న కొద్దీ.. మన మఖంలో గ్లో తగ్గిపోతూ ఉంటుంది. అయితే... అలా తగ్గకుండా ఉండాలటే... మనం మన చర్మాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇలా జరగాలి అంటే.... స్నానం చేయడానికి ముందు  కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట

ఏ అమ్మాయి అయినా.. తమ ముఖం ప్రకాశవంతంగా ఉండాలని, అందంగా మెరిసిపోవాలని కోరుకుంటారు. దాని కోసం  అందరూ ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ.. వయసు పెరుగుతున్న కొద్దీ.. మన మఖంలో గ్లో తగ్గిపోతూ ఉంటుంది. అయితే... అలా తగ్గకుండా ఉండాలటే... మనం మన చర్మాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇలా జరగాలి అంటే.... స్నానం చేయడానికి ముందు  కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. ఆ జాగ్రత్తలేంటో ఓసారి చూద్దాం...

స్నానం నీటిలో నిమ్మరసం...

మీరు మీ చర్మాన్ని తాజాగా ఉంచుకోవాలి అంటే... స్నానం చేసే ముందు... ఆ నీటిలో నిమ్మ రసం పిండుకోవాలి.  ఆ తర్వాత.. ఆ నీటితో  స్నానం చేయాలి.  ఇలా రెగ్యులర్ గా.. నిమ్మరసం పిండిన నీటితో స్నానం చేయడం వల్ల.. చర్మం బాగా శుభ్రపడి.. మెరుస్తూ కనిపిస్తుందట. అయితే.. ఒక్కరోజు చేస్తే ఆ మెరుపు రాదు. రెగ్యులర్ గా చేయడం వల్ల ఫలితం లభిస్తుంది.

Latest Videos


ముల్తానీ మట్టి...

ముల్తానీ మిట్టిని ఉపయోగించడం వల్ల చర్మంపై మెరుపు వస్తుంది, కాబట్టి మీరు స్నానానికి ముందు ముల్తానీ మిట్టిని కూడా ఉపయోగించవచ్చు. ముల్తానీ మిట్టిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ ముఖంలో మెరుపును పెంచడంలో ఉపయోగపడతాయి. స్నానానికి ముందు ముల్తానీ మిట్టిని చర్మానికి పట్టించి, ఆ తర్వాత చర్మాన్ని శుభ్రంగా కడిగి స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు  చేస్తే.. కచ్చితంగా మీకు ఫలితం కనపడుతుంది. 

చందనం...

మహిళలు  గంధపు పొడిని ఉపయోగించి ముఖం మెరిసేలా చేయవచ్చు. ఇది అనేక లక్షణాలను  కలిగి ఉంటుంది. గంధంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ యాంటిసెప్టిక్ గుణాలు ఉన్నాయి కాబట్టి గంధం చర్మానికి మేలు చేస్తుంది. అనేక చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడానికి చందనం ఉపయోగపడుతుంది. తలస్నానం చేసే ముందు గంధాన్ని ముఖానికి పట్టించి, పేస్ట్ ఆరిన తర్వాత శుభ్రంగా కడగాలి. ఇది కూడా చాలా తక్కువ సమయంలో మంచి ఫలితాన్ని అందిస్తుంది. 

click me!