సాధారణ/మృదువైన చర్మం కోసం ఫేస్ మాస్క్..
1/4 కప్పు పాలను తీసుకుని, అందులో చిటికెడు పసుపు, అర టీస్పూన్ బియ్యం పిండితో ఒక టీస్పూన్ తేనె కలపండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి.
చర్మ సమస్యలను నివారించడానికి వేసవిలో కారం, అధిక పులుపు, పులియబెట్టిన, డీప్ ఫ్రైడ్ , నాన్ వెజ్ ఫుడ్ మానేయండి. ఆరోగ్యకరమైన చర్మానికి మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. ఈ విషయాలు గుర్తించుకుంటే.. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.