ఆడవారికి ఎక్కువగా వచ్చే వ్యాధులేంటో తెలుసా?

Published : Aug 17, 2024, 04:02 PM IST

ఆడవాళ్లు తమ ఆరోగ్యం కంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించే ఎక్కువగా పట్టించుకుంటారు. దీనివల్లే  వీళ్లు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అసలు ఆడవాళ్లకు ఎక్కువగా వచ్చే వ్యాధులేంటో తెలుసా? 

PREV
15
ఆడవారికి ఎక్కువగా వచ్చే వ్యాధులేంటో తెలుసా?


ఆడవాళ్ల రోజువారి జీవితం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫీసుకు వెళ్లినా, ఇంటిదగ్గర ఉన్నా.. కుటుంబాన్ని చూసుకోవాల్సింది వీళ్లే. ఇటు ఇంటి పనులు, అటు ఆఫీసు పనులను చేసుకుంటూ బీజీ బిజీగా ఉంటారు. ఆఫీసులకు వెళ్లని వారికి పనులు తక్కువగా ఉంటాయంటే అదీ లేదు. ఏదేమైనా ఆడవారు కుటుంబాన్ని చక్కదిద్దడం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి, వారి బాగోగుల గురించి శ్రద్ధ తీసుకోవడంలోనే సమయాన్ని గడుపుతారు. చాలా మంది ఆడవారు తమకంటూ కొంత సమయాన్ని వెచ్చించాలని కూడా ఆలోచించరు. ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోరు. ఎంతసేపు కుటుంబం గురించే ఆలోచిస్తారు. ఇదే వారిని ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తుంది. అసలు ఆడవాళ్లు ఎక్కువగా ఏ వ్యాధుల బారిన పడతారో తెలుసా? 
 

25
anemia

రక్తహీనత

మగవారితో పోలిస్తే ఆడవారే ఎక్కువగా రక్తహీనత సమస్య బారిన పడతారు.ఇది ఇండియాలో ఒక సర్వసాధారణమైన సమస్య. పురుషుల కంటే ఆడవాళ్లకే ఈ సమస్య రావడానికి ప్రధానంగా ఒక కారణం ఉంది. అదే నెలసరి. ఈ సమయంలో హెవీ బ్లీడింగ్, గర్భం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. మీకు తెలుసా? మన దేశంలో సుమారుగా 75 శాతం మంది మహిళలు ఐరన్ లోపం, రక్తహీనతతో బాధపడుతున్నారని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

35
breast cancer

రొమ్ము క్యాన్సర్

ఆడవాళ్లకు ఎక్కువగా వచ్చే క్సాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. రొమ్ము క్యాన్సర్ తో బాధపడే వారి సంఖ్య మన దేశంలో ఏటేటా పెరుగుతూనే ఉంది. మీకు తెలుసా? మన దేశం రొమ్ము క్యాన్సర్ కేసుల్లో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. భారతీయ మహిళలు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
 

45

మానసిక ఆరోగ్యం

మగవారి కంటే ఆడవాళ్లకే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలపై హింస పెరగడం, గృహ హింస,సామాజిక ఒత్తిడి వంటి ఎన్నో కారణాల వల్ల వీరి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. 

55
osteoporosis

బోలు ఎముకల వ్యాధి

ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. అయితే కాల్షియం లోపం, ఇతర పోషకాల వల్ల బోలు ఎముకల వ్యాధి వస్తుంది. ఎముకలు బలహీనంగా మారుతాయి. అయితే ఈ బోలు ఎముకల వ్యాధి కూడా ఆడవారికి ఎక్కువగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మెనోపాజ్ పీరియడ్ తర్వాత ఈ సమస్య వస్తుంది. కాల్షియం లోపం, తగినంత పోషకాహారం తీసుకోకపోవడం, జీవనశైలి మార్పుల వల్ల బోలు ఎముకల వ్యాధి వస్తుంది.

click me!

Recommended Stories