డా. నివేద్ రావు మాట్లాడుతూ, క్యాన్సర్ను తొలిదశలో గుర్తిస్తే జీవన అవకాశాలు 70 నుంచి 90 శాతం వరకు ఉంటాయని తెలిపారు. అయినప్పటికీ అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది చివరి దశలోనే ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో నిరంతర అవగాహన అవసరం అని చెప్పారు.
ఆధునిక చికిత్సలతో మెరుగైన ఫలితాలు
కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డా. గౌతమ్ మాట్లాడుతూ, క్యాన్సర్ పట్ల భయం, అపోహల కారణంగా చికిత్స ఆలస్యం అవుతోందని అన్నారు. ప్రస్తుతం కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ వంటి ఆధునిక వైద్య విధానాలతో ప్రారంభ దశలోనే మంచి ఫలితాలు సాధ్యమవుతున్నాయని తెలిపారు. సమయానికి వైద్యులను సంప్రదిస్తే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు.