పదవిపై కాంక్ష అతడిని మృగంలా మార్చింది. ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీ చేయడానికి అవకాశం ఉండదని ఓ బిడ్డను చేజేతులా చంపేశాడు. ముక్కుపచ్చలారని ఆ చిన్నారి తండ్రి క్రూరత్వానికి బలైన దారుణం నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.
25
కన్న కూతురుని ఎందుకు చంపాడు..?
నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకాలోని కేరూర్ గ్రామంలో పాండురంగ్ కొండమంగ్లే కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇతడు గ్రామంలోనే సెలూన్ నడుపుతాడు. అయితే ఇతడికి రాజకీయాలంటే ఆసక్తి… ఎప్పటికైన సర్పంచ్ కావాలన్నది కల. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది… త్వరలోనే మహారాష్ట్రలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు. కానీ అతనికి ఒక కొడుకు, ఆరేళ్ల కవల కూతుళ్లు సంతానం… ఈ సంతానమే అతడికి అడ్డుగా మారారు.
మహారాష్ట్రలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం కలిగినవారు పంచాయితీ ఎన్నికల్లో పోటీకి అనర్హులు. ఈ నిబంధన వల్ల ఎక్కడ తన సర్పంచ్ కల చెదిరిపోతుందోనని పాండురంగ్ ఆందోళనకు గురయ్యాడు.. ఈ సమస్యను గ్రామ సర్పంచ్ గణేష్ రాంచంద్ర షిండేతో చర్చించాడు. ఇద్దరూ కలిసి కవలల్లో ఒకరైన ప్రాచి అడ్డు తొలగించుకోవాలని దారుణమైన ప్లాన్ వేశారు.
35
దత్తత ఇవ్వడం లేదా వదిలేయడం కుదరలేదా?
పోలీసుల విచారణలో మొదట పాపను దత్తత ఇవ్వాలని అనుకున్నట్టు తెలిసింది. కానీ బర్త్ సర్టిఫికెట్లో పేరు ఉండటంతో ఎన్నికలకు అనర్హత తప్పదు. పాపను వదిలేద్దామనుకున్నా, తిరిగి వస్తుందనే భయంతో చివరికి హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.
పాండురంగ్ తన ఆరేళ్ల కూతురు ప్రాచిని స్వగ్రామం నుండి బైక్పై తీసుకువచ్చాడు. వీళ్లు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ కాలువ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ పాపను కాలువలోకి తోసేసిన పాండురంగ్ తనకేమీ తెలియదన్నట్లు పారిపోయాడు. అయితే సమీప పొలాల్లోని వారు శబ్దం విని చూడగా అప్పటికే పాప శవం నీటిలో తేలుతూ కనిపించింది.
55
నిజం పోలీసులకు ఎలా తెలిసింది?
పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పాప ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక వ్యక్తి ఫోటోను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పాండురంగ్ ను పిలిచి తమదైన స్టైల్లో విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో పాండురంగ్, అతడికి సహకరించిన సర్పంచ్ను అరెస్ట్ చేశారు.