తెలంగాణలోనూ రుతుపవనాల జోరు పెరిగింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచే వాతావరణం చల్లబడింది. ఐటీ కారిడార్ అయిన మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంతో పాటు కూకట్పల్లి, కేపీహెచ్బీ, నిజాంపేట్ ప్రాంతాల్లో వర్షం పడుతుండటంతో ఉద్యోగులు, ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ఛాన్స్ ఉండటంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.