తెలంగాణలో గత వారం రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. సూర్యాపేటలో అత్యధికంగా 38 డిగ్రీలు నమోదు కాగా, ఖమ్మం, నల్గొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 37 డిగ్రీల మార్కును దాటేసింది. గాలిలో తేమ 100 శాతానికి చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అయితే శుక్రవారం నుంచి ఈ పరిస్థితి పూర్తిగా మారనుంది. తెలంగాణలోని ఉత్తర, తూర్పు, మధ్య జిల్లాల్లో వర్ష ప్రభావం చాలా తీవ్రంగా ఉండనుంది.
ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు: ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం.
ఇతర ప్రాంతాలు: ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.