ఈ బడ్జెట్ మొత్తం రూ.3.24 లక్షల కోట్ల అంచనాలతో రూపొందించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది ఎక్కువ. విద్యా రంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకం, ప్రీప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్ పథకం, ఐటీఐ, ఏటీసీ విద్యార్థులకు నెలకు రూ.2000 స్టైపెండ్ ఇవ్వనున్నారు. విద్యా రంగానికి ప్రత్యేకంగా రూ.26,674 కోట్లు కేటాయించారు.
మెరుగవుతోన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తలసరి ఆదాయం రూ.4.18 లక్షలకు చేరిందని, రాష్ట్ర ఆర్థిక వృద్ధి జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదైందని ప్రభుత్వం చెబుతోంది.