ఈ వర్గీకరణ వెనుక ప్రత్యేక అధ్యయనం ఉంది. 2024 అక్టోబర్లో ప్రభుత్వం మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన వన్ మెన్ కమిషన్ను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో పర్యటించి, ఎస్సీ ఉప కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసింది. మొత్తం 8,600కి పైగా ప్రతిపాదనలు అందుకున్న కమిషన్ జనాభా, అక్షరాస్యత, ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్యలో ప్రవేశాలు, ఆర్థిక వనరులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై విశ్లేషణ చేసి ఫిబ్రవరి 3న తుది నివేదికను సమర్పించింది.