ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది... ఇలా తమిళనాడులో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 23న కీలకమైన పోలింగ్ జరగనుంది.. అందువల్లే అక్కడ ఉద్యోగులు, కార్మికులకు అధికారిక సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
అయితే తెలంగాణలో కూడా ఉపాధి, ఉద్యోగాల కోసం చాలామంది తమిళులు నివాసముంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో తమిళ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. వీరందరికీ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది రేవంత్ సర్కార్... పోలింగ్ రోజు (ఏప్రిల్ 23) తెలంగాణలోని తమిళ ఉద్యోగులు, కార్మికులకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారికే కాదు ప్రైవేట్ రంగంలోని తమిళులకు కూడా ఏప్రిల్ 23న అంటే ఈ గురువారం సెలవు వర్తిస్తుంది. ఇక ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, దుకాణాల్లో పనిచేసే కార్మికులకు కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఇలా తెలంగాణలోని తమిళుల సెలవుపై రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.