Holidays : తెలంగాణ ఉద్యోగులకు బంపరాఫర్... ఏప్రిల్ 23, 29 రెండ్రోజులు సెలవే..!

Published : Apr 21, 2026, 04:38 PM IST

Holidays : తెలంగాణలో పనిచేసే కొందరు ఉద్యోగులు, కార్మికులకు ఏప్రిల్ 23, 29 రెండ్రోజులు ప్రత్యేక సెలవు వస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా చేసింది. ఇంతకూ ఎవరికి ఈ సెలవు వర్తిస్తుందో తెలుసా..?

PREV
14
తెలంగాణలో పనిచేసేవారికి సెలవులే సెలవులు..

Holidays : తెలంగాణలోని కొందరు ఉద్యోగులు, కార్మికులకు గుడ్ న్యూస్. ఈ ఏప్రిల్ లో ఊహించని విధంగా సెలవులు వస్తున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 9న కొందరు ఉద్యోగులకు సెలవు ఇచ్చారు... ఇక ఏప్రిల్ 23, 29న మరో రెండు సెలవులు రానున్నాయి. అయితే ఈ సెలవులు అందరికీ కాదు.. కొందరు ఉద్యోగులకు మాత్రమే. అసలు ఈ సెలవులెందుకు..? ఎవరికి వర్తిస్తాయి..? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

24
ఏప్రిల్ 23న సెలవు ఎందుకు..?

ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది... ఇలా తమిళనాడులో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 23న కీలకమైన పోలింగ్ జరగనుంది.. అందువల్లే అక్కడ ఉద్యోగులు, కార్మికులకు అధికారిక సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

అయితే తెలంగాణలో కూడా ఉపాధి, ఉద్యోగాల కోసం చాలామంది తమిళులు నివాసముంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో తమిళ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. వీరందరికీ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది రేవంత్ సర్కార్... పోలింగ్ రోజు (ఏప్రిల్ 23) తెలంగాణలోని తమిళ ఉద్యోగులు, కార్మికులకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది.

ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారికే కాదు ప్రైవేట్ రంగంలోని తమిళులకు కూడా ఏప్రిల్ 23న అంటే ఈ గురువారం సెలవు వర్తిస్తుంది. ఇక ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, దుకాణాల్లో పనిచేసే కార్మికులకు కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఇలా తెలంగాణలోని తమిళుల సెలవుపై రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

34
ఏప్రిల్ 29న సెలవే...

కేవలం తెలంగాణలోని తమిళులకే కాదు బెంగాలీలకు కూడా ప్రత్యేక సెలవు ఇస్తోంది రేవంత్ సర్కార్. తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ లో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. కాబట్టి తమిళులతో పాటు బెంగాలీలకు కూడా ఈ గురువారం సెలవు వర్తిస్తుంది.

అయితే పశ్చిమ బెంగాల్ లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి... ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ జరుగనుంది. కాబట్టి ఈరోజు కూడా తెలంగాణలోని బెంగాలీలకు పెయిడ్ హాలిడే ఇస్తోంది ప్రభుత్వం. హైదరాబాద్ లో వేలాదిమంది బెంగాలీ ఉద్యోగాలు, వివిధ వ్యాపారాలు ఉన్నాయి.. వీరందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది.

44
మలయాళీ, అస్సామీలకు సెలవే..

ఇటీవల అస్సాం, కేరళలో ఎన్నికలు జరిగాయి... ఈ సమయంలో కూడా తెలంగాణలోని మలయాళీలు, అస్సామీలకు సెలవు ఇచ్చింది ప్రభుత్వం. ఏప్రిల్ 9న కేరళ, అస్సాంలో పోలింగ్ జరిగింది... తెలంగాణలో పనిచేసే వేలాదిమంది మలయాళ నర్సులు, ఇతర ఉద్యోగులు... అస్సాంకు చెందిన కార్మికులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వం పెయిడ్ హాలిడే ఇవ్వండంవల్ల వీళ్లంతా ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యారు.

Read more Photos on
click me!

Recommended Stories