IMD Rain Alert : ఈ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వానలు... ఆరెంజ్ అలర్ట్.. అంటే అల్లకల్లోలమేనా..!

Published : Apr 21, 2026, 10:56 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు 40-45 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నాయి… మరోవైపు ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ (ఏప్రిల్ 21న) అయితే అల్లకల్లోలం తప్పేలా లేదు.. అందుకే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.  

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు...

IMD Rain Alert : తెలుగు ప్రజలారా... ఈ నాలుగైదు రోజులు తస్మాత్ జాగ్రత్త. ఓవైపు మండుటెండలు... మరోవైపు ఈదురుగాలులు, వడగళ్ల వానలు... ఇలా వాతావరణం అల్లకల్లోలం సృష్టించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వాతావరణ శాఖల ప్రకారం... తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నేడు (ఏప్రిల్ 21, మంగళవారం) వెదర్ ఎలా ఉంటుందో చూద్దాం.

25
తెలంగాణలో వర్షాలు..

ముందుగా తెలంగాణ విషయానికి వస్తే... ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎండావాన పరిస్థితులు ఉన్నాయి. మరికొన్నిరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్యాహ్నమంతా ఎండలు ఇరగదీస్తాయి, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి... ఇక సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది... మేఘాలు కమ్మేసి చల్లగా మారుతుంది, వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

35
నేడు హైదరాబాద్ వాతావరణం...

హైదరాబాద్ లో ఇవాళ ఉదయం నుండే వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటోంది వాతావరణ శాఖ. కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, ఆల్వాల్, కుత్బుల్లాపూర్, కాప్రా, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయట. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయంటోంది. ఇలా వర్షాలతో ఉదయం చల్లగా ఉన్నా మధ్యాహ్నానికి ఎండలు ముదురుతాయని తెలిపింది. అత్యధికంగా 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

సాయంత్రానికి మళ్లీ హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని... రాత్రి సమయంలో ఈదురుగాలులతో (గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో) కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇలా ఉదయం, సాయంత్రం వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

45
ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్స్..

హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి... అందుకే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వానలు కురిసే అవకాశాలున్నాయట... ఈదురుగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణ వాతావరణ శాఖ.

55
ఆంధ్ర ప్రదేశ్ లో ఎండావాన..

ఇదిలావుంటే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎండావాన పరిస్థితులు ఉంటాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ (ఏప్రిల్ 21) కొన్నిచోట్ల ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 46మండలాల్లో తీవ్ర, 29 మండలాల్లో వడగాలులు వీస్తాయని... 289 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories