ఆంధ్ర ప్రదేశ్ లో ఎండావాన..
ఇదిలావుంటే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎండావాన పరిస్థితులు ఉంటాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ (ఏప్రిల్ 21) కొన్నిచోట్ల ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 46మండలాల్లో తీవ్ర, 29 మండలాల్లో వడగాలులు వీస్తాయని... 289 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.