అయితే బిజెపి అదిష్టానం కూడా రాజకీయ అనుభవం, కేసీఆర్ ను ఢీకొట్టే సత్తావున్న ఈటల రాజేందర్ కు వుందని నమ్ముతోందట. దీంతో బిసి సీఎం అభ్యర్థిగా ఆయనను ప్రకటించే అవకాశం వుందని ప్రజల్లోనూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటలను బరిలోకి దింపడంద్వారా బిజెపి బిసి సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై అదిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు.