ఇక ఇప్పటికే కాయితీ లంబాడీలు కూడా కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీకి సిద్దమయ్యారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 1,016 మంది లంబాడీలు త్వరలోనే నామినేషన్లు వేస్తారని ప్రకటించారు. ఇలా కేసీఆర్ పై రైతులు, వివిధ వర్గాల ప్రజలు పోటీ చేస్తామంటూ ప్రకటించడం రాజకీయ కలకలం రేపుతోంది.