అక్టోబర్ 7న ప్రధాని నరేంద్ర మోదీతో ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సభలో పాల్గొనాల్సిందిగా పవన్ ను ఆహ్వానించామని... అందుకు ఆయన ఒప్పుకున్నారని తెలిపారు. తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని, జనసేనాని పాల్గొంటారని... బిజెపి శ్రేణులు, ప్రజలు భారీగా తరలిరావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.