తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నెల(జులై) 23న అంటే వచ్చే బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల బంద్కు పిలుపునిచ్చాయి. విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ బంద్ కు సహకరించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు, జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కొరత, స్కాలర్ షిప్ ల విడుదల… ఇలా విద్యావ్యవస్థ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించి విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు విద్యార్థి సంఘాల నాయకులు. కాబట్టి బుధవరం తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు మూతపడనున్నాయి.