ఎక్కడ అందుబాటులో ఉన్నాయి.
రాజీవ్ స్వగృహకు సంబంధించి గాజుల రామారం, పోచారం, ఖమ్మంలోని పోలేపల్లి ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న టవర్లను మొత్తంగా విక్రయించనున్నారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 514, కుర్మల్ గూడలో 20, చందానగర్లోని 3 ఓపెన్ ఫ్లాట్లు, బండ్లగూడలో 159 పూర్తియిన ఫ్లాట్లు, మేడ్చల్ -మల్కాజ్గిరి గాజులరామారంలో 5 టవర్లలోని పూర్తి కాని టవర్లు, పోచారంలోని పూర్తయిన 601 ఫ్లాట్లు, అసంపూర్తిగా ఉన్న 6 టవర్లలోని వివిధ రకాల ఫ్లాట్లు, బహదూర్ పల్లిలోని 69 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను హౌసింగ్ అధికారులు కోరుతున్నారు. వేలం ద్వారా వచ్చిన ఆదాయంతో ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లోనూ, ఇతర జిల్లాల్లోనూ సాధారణ ప్రజలకు హౌసింగ్ టౌన్ షిప్లు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.