తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లోనూ వర్ష సూచనలు ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది.
వర్షాల సమయంలో చెట్ల కింద, ఫ్లెక్స్ హోర్డింగ్ల దగ్గర నిలబడకూడదని, బలమైన గాలులకు అవి కూలే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఎటువంటి ప్రమాదానికి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.