Rain Alert: ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు.. వ‌చ్చే 3 రోజులు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే

Published : Apr 04, 2026, 07:08 AM IST

Rain Alert: తెలంగాణలో వాతావ‌ర‌ణం పూర్తిగా మారే అవకాశం ఉంద‌ని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం వల్ల వ‌ర్షాలు కురుస్తాయ‌ని, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

PREV
15
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్ష సూచన

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా అంచనాల ప్రకారం, తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశముంది. వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా ఉరుములు, మెరుపులు కూడా చోటు చేసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు.

25
శనివారం ఈ జిల్లాల్లో వర్షాలు

ఈరోజు (శనివారం) ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతాల్లో గంటకు సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

35
ఆదివారం మరిన్ని జిల్లాలకు వర్ష ప్రభావం

ఆదివారం కూడా వర్షాలు కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లతో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

45
ఐదు రోజుల పాటు ఎల్లో అలర్ట్

భారత వాతావరణ శాఖ ప్రకారం ఏప్రిల్ 3 నుంచి 7 వరకు రాష్ట్రంలో వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపించనున్నాయి. ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలుల వేగం గంటకు 30–40 కిలోమీటర్ల వరకు చేరవచ్చని అధికారులు తెలిపారు. 

55
ఎండలు కొనసాగుతూనే వర్ష సూచన

వర్ష సూచనలు ఉన్నప్పటికీ ఎండల ప్రభావం మాత్రం త‌గ్గ‌ద‌ని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్క్ దాటాయి. ఆదిలాబాద్ జిల్లాలో 40.5 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్, షేక్‌పేట్ ప్రాంతాల్లో 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హైదరాబాద్‌లో ప్రత్యేక వాతావరణ పరిస్థితులు

హైదరాబాద్ నగరంలో కూడా వాతావరణంలో మార్పులు కనిపించే అవకాశం ఉంది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్.బి.నగర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఉదయం వేళల్లో స్వల్ప పొగమంచు కనిపించే అవకాశం ఉందని అంచనా. ప్రత్యేకంగా ఏప్రిల్ 6న నగరంలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories