పగటిపూట ఎండలో తిరగడం ఇబ్బంది అనుకుంటే సాయంత్రం వేళ ఈ ప్రదేశాలు బెస్ట్ ఆప్షన్.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ : ఇక్కడ లైటింగ్, పక్కనే ఉన్న పార్క్ పిల్లలకు నచ్చుతాయి.
లుంబినీ పార్క్: హుస్సేన్ సాగర్లో బోటింగ్ చేస్తూ బుద్ధ విగ్రహాన్ని చూడటం, సాయంత్రం వేళ లేజర్ షో వీక్షించడం ఒక మంచి ఫ్యామిలీ అవుటింగ్.
తల్లిదండ్రుల కోసం సూచనలు
సమయపాలన : ఉదయం 11 నుండి సాయంత్రం 4 వరకు సాధ్యమైనంత వరకు ఇండోర్ (ఏసీ) ప్రదేశాలకే పరిమితం అవ్వండి.
ఆహారం : పిల్లలకు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, సరిపడా మంచినీరు అందిస్తూ ఉండండి.
దుస్తులు : తేలికపాటి కాటన్ దుస్తులు ధరిస్తే ప్రయాణం హాయిగా సాగుతుంది.
ఈ వేసవిలో ఇంట్లోనే ఉండి బోర్ కొట్టకుండా, మీ పిల్లలను ఈ ప్రాంతాలకు తీసుకెళ్లి వారి ముఖాల్లో చిరునవ్వులు చూడండి!