గురువారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.