అల్పపీడనం కారణంగా శనివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో వర్షాలు కురిసింది.
ముంచింగిపట్టులో అత్యధికంగా 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో వరి నాట్లు, పత్తి, అపరాల పంటలకు ఈ వర్షాలు ఉపశమనం కలిగించాయి. ఐదారురోజులుగా కురుస్తున్న వానలతో పంటలు పుంజుకున్నాయని రైతులు చెబుతున్నారు.