శనివారం తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడె, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
హైదరాబాద్ శుక్రవారమంతా చిరుజల్లులు కురుస్తానే ఉన్నాయి... శనివారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. రంగారెడ్డి, భువనగిరి, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.