ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి జరిగే అవినీతి దర్యాప్తులో భాగంగా కేటీఆర్ను ఏసీబీ విచారణకు పిలిచింది. ఈ విచారణకు హాజరు కావడానికి ముందుగా ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసానికి చేరుకున్నారు.
ఏసీబీ విచారణకు ముందుగా కేటీఆర్ తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో విచారణకు సంబంధించిన అంశాలు, రాజకీయ వ్యూహాలు చర్చించినట్లు సమాచారం.