హైదరాబాద్ ప్రజలు అత్యంత సులభంగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ముందుగా పటాన్చెరువు చేరుకోవాలి. ఇక్కడి నుంచి కొడకంచి ఆలయం సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. పటాన్ చెరువు బస్టాండ్ నుంచి జిన్నారం వైపు వెళ్లే రహదారి ద్వారా సులభంగా చేరుకోవచ్చు. స్థానిక బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. అయితే ప్రైవేట్ వాహనాలైతే ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. పటాన్ చెరు నుంచి కేవలం 20 నిమిషాల్లో ఆలయానికి చేరుకోవచ్చు. అలాగే నగరంలో ఎక్కడి నుంచైనా సుమారు గంటలో ఆలయం వెళ్లొచ్చు.
ఆసక్తికరమైన అంశాలు
* ఆలయంలో కంచి తరహాలో ప్రతిరోజూ పూజలు జరుగుతాయి.
* స్వామివారిని దర్శించడం వల్ల కుటుంబంలో శాంతి, సంపద కలుగుతుందని అంటారు.
* ప్రత్యేక ఉత్సవాల సమయంలో ఆలయం చుట్టూ పల్లె వాతావరణం మరింత ఆధ్యాత్మికంగా మారుతుంది.
* కేవలం ఒక్క రోజులోనే ఈ ఆలయానికి వెళ్లి రావొచ్చు. కాగా ఈ ఆలయాన్ని దర్శించుకునే సమయంలో మరో మూడు ఆలయాలను కూడా సందర్శించవచ్చు. బొంతపల్లిలోని శ్రీ వీర భద్ర స్వామీ ఆలయం, ఇంద్రేశంలోని శ్రీ ఇంద్రేశ్వర స్వామీ ఆలయం, బీరంగూడలోని శ్రీ బ్రమరాంభ మల్లీఖార్జున స్వామీ ఆలయాన్ని దర్శించుకోవచ్చు.