వాతావరణ మార్పుల నేపథ్యంలో చలి తీవ్రత పెరుగుతుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
చలిని తట్టుకునేందుకు స్వెటర్లు, జాకెట్లు, మఫ్లర్లు ధరించాలి.
శరీరాన్ని వేడి ఉంచేందుకు గోరువెచ్చని నీరు, సూప్లు, పోషకాహారం తీసుకోవాలి.
వృద్ధులు, చిన్నపిల్లలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప, రాత్రి బయటకు వెళ్లకూడదు.
చర్మం పొడిబారకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్లు వాడాలి.
రైతులు పంటలను చలిగాలుల ప్రభావం నుంచి కాపాడుకునేందుకు రక్షణ చర్యలు చేపట్టాలి.
వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం, రానున్న రోజుల్లో తెలంగాణలో చలి తీవ్రత మరింతగా పెరుగుతుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలు చేసింది.